పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

53


వ.

అని చెప్పి మఱియు వసిష్ఠుం డి ట్లనియె నప్పరమయోగినులు చనిన
యనంతరంబ యొక్కభూపాలుం డనేకబలసమన్వితుం డై చనుదెంచి
విదూరపురంబుపై విదిసి యుద్ధార్థి యై పిలిపించిన నతండును జ
తురంగబలసమేతుండై పురంబు వెలువడి తలపడిన నుభయబలంబు
లకుఁ బోరు ఘోరం బయ్యె నట్టియెడ.

90


శా.

ఆరాజన్యు లుదగ్రు లుగ్రగతి నన్యోన్యప్రహారార్థు లై
వీరానీకము విచ్చలింపఁగ భుజావీర్యం బవార్యంబుగా
గ్రూరాస్త్రంబుల నొండొరుం బొదివి దిక్కుల్ వ్రయ్యఁ బెల్లార్చుచున్
బోరాడంగ విదూరుఁ డీల్గె నపు డాభూమీశుచే భూవరా.

91


వ.

ఇట్లు పడిన యతనిజీవరేఖ విద్యుల్లేఖయుం బోలె గగనంబున కెగ
యుట గనుంగొని సరస్వతి లీల కి ట్లనియె.

92


ఉ.

కోమలి యిప్పు డిట్లు మనకుం బ్రతిపత్తి యొనర్చి భూవర
గ్రామణి యివ్విదూరుఁ డిటు గయ్యమునం బగవారిచే మృతుం
డై మహి వ్రాలె గంటె యది యక్కట యాతనిజీవరేఖ సౌ
దామనివోలె నెచ్చటికిఁ దారెడునో చని చూచి వత్తమే.

93


వ.

అని యయ్యిరువురు నత్తేజంబు వెనుచన నదియు ననేకసర్గపరం
పరలు బరిభ్రమించి మఱియును.

94


ఉ.

కొండలు నబ్ధులు న్నదులుఁ గోన లసంఖ్యము దాఁటి చిద్వియ
న్మండల మూఁది యచ్చట వనంబు ఫలంబులుఁ బోలెఁ బేర్చి యొం
డొం డొరువర్తనం బెఱుఁగకుండఁ జరించుచు నున్నయట్టి బ్ర
హ్మాండసముచ్చయంబు లోకయర్బసదంఖ్యలు చూచి యవ్వలన్.

95


క.

వివిధమణిగోపురంబుల
వివిధావరణముల నధికవిభవం బై యా
దివిజేంద్రుపట్టణముగతి
భువిఁ బెం పగుచున్నపద్మపురి వెసఁ జొచ్చెన్.

96