పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

51


విభుం డాత్మగతంబున 'నోహో యతివిస్మయం బగుసంసారమా
య యిమ్మహాయోగినులకతంబున నాకుం బరిజ్ఞాతం బయ్యె' నని
పలికి వారలం గనుంగొని ముకుళితకరకములుం డయి యిట్లనియె.

82


క.

వనజాక్షులార వినుఁ డీ
తను వెడలినదినమునకును దగ షోడశహా
యనము లయి పెక్కుగార్యము
లును బంధులు మిత్త్రగణములును దోచె మదిన్.

83


వ.

అనిన విని వాణి యి ట్లనియె.

84


సీ.

ఉహింప మృతిమహామోహమూర్ఛానంత
        రంబున నీ కిట్లు రాజఋషభ
యాలోకమును భాసి యమ్ముహూర్తమునను
        నాయింటిలోనను నలఘుసర్గ
విభ్రమం బుదయించె వేఱె యాకాశని
        ర్మల మైనయట్టి యామనమునందు
విలసిల్లు వ్యవిహారవిభ్రమకృత మైన
        యీప్రతిభాస నీ కిచటఁ బుట్టెఁ


గీ.

బరఁగఁ బదియాఱువర్షాలప్రాయ మగుట
తలఁపఁ గలలోన నొకముహూర్తంబునందు
వర్షశత మగు నేమాయవలన నెట్ల
నదియ యీజాగరభ్రాంతి యని యెఱుంగు.

85


మ.

పరమార్థంబునఁ బుట్టుట ల్మడియుటల్ భావింప లే వెన్నఁడున్,
నిరుపాధిస్థితిశుద్ధబోధమయ మై నీయందు నీ వుండితి,
ట్టిరువారన్ సకలంబు గన్గొనుచు నొం డీక్షింప వొక్కింతయున్,
బొరి సర్వాత్మతఁ జేసి నీవ జననంబుం దాల్తు నీయం దొగిన్.

86


క.

వితతపదార్థారూఢుఁడు