పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

వాసిష్ఠరామాయణము


        నతులితయోగసమాధినుండి
జ్ఞానదేహముతోడ శారద య ట్లేగఁ
        దరుణియు మానుషతనువు విడిచి
దివ్యకాయముఁ దాల్చి దివి నుండి యిరువురు
        నలకు బ్రహ్మాండమండలముఁ బాసి
యటు పోవ నొకశైలతటమున నొక్కగ్రా
        మమునందు నొకవిప్రమంటపంబు


గీ.

గని యదృశ్యాంగు లయి యటఁ గదలి వేగ
నరిగి రెండవసర్గంబునందుఁ బొంది
పువ్వుఁబానుపుపైఁ బద్మభూమిపాలు
శవముతో నొప్పు మంటపస్థలము గనిరి.

78


క.

కని యోగస్థితి నొందియుఁ
జనుదెంచి నిజేశుఁ డున్న సదనంబునకున్
మన మలర దివ్యయోగిని
వనితామణి లీల వేడ్క వాణియుఁ దానున్.

79


గీ.

ఇట్లు చనుచేరఁ దత్పతి యెదురు వచ్చి
యమ్మహాదేవి కెఱఁగి పాదాంబుజంబు
లందుఁ బుష్పంబు లర్పించి యచలభక్తి
మ్రోల నిలుచున్న యాభూమిపాలుఁ జూచి.

80


క.

జననాయక నీతొల్లిటి
జననము మదిఁ దలఁపు మనుచు శారద దయ నా
తనిశిరమునఁ జే యిడ న
మ్మనుజేంద్రున కంత హృదయమాయ దొఱంగెన్.

81


వ.

ఇట్లు మనోగతం బయినమాయ యాక్షణంబ పాసి తన పూర్వజన్మవృ
త్తాంతం బంతయు మనంబునఁ దోచిన నచ్చెరు వొంది యవ్విదూర