పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

47


ద్గృహంబునం దున్నయది. యని చెప్పిన విస్మయం బంది లీల యి
ట్లనియె.

62


క.

అక్కట విప్రునిజీవం
బెక్కడ నెచ్చోట నున్న? దే మెక్కడ? నీ
దిక్కులు గిరులును భూమియు
నెక్కడ మాయింట నణఁగె? నిది మిథ్య సఖీ.

63


సీ.

సర్షపకోటరస్థలి మదాంధం బైన
        దేవతాగజము బంధింపఁబడియె;
నణువులోపల మహాహర్యక్షసమితి దాఁ
        బొరి నొక్కదోమచేఁ బొరలఁబడియె;
కమలబీజములోనఁ గనకాద్రి యుండంగ
        భృంగపోతముచేత మ్రింగఁబడియె;
ననినట్లు పొసఁగనియనృతోక్తు లెట్లాడి?
        తనవుడు లీల కి ట్లనియె దేవి;


గీ.

మెఱయ నామాట లెందును మిథ్య గావు
వినుము మనచేత నియతిభేదనము సేయఁ
బడదు దనయూర నాత్మీయభవనమునన
నుండు నావిప్రుజీవాత్మయును లతాంగి.

64


వ.

అమ్మహారాష్ట్రం బాకాశరూపంబు గావున నాకాశాత్ముం డైన యతం
డంద యుండి చూచుచుండు నట్లు గావున.

65


గీ.

తరుణి మాయిద్దఱకుఁ దొంటితలఁపులందు
మఱపు జనియించి వేఱ సంస్మరణ వొడమెఁ
గలల జాగ్రదవస్థల తలఁపు లెట్టు
లట్ల మరణంబు మర్త్యుల కంబుజాస్య.

66


గీ.

అరయ సంకల్పముకురంబునందుఁ బోలెఁ