పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

వాసిష్ఠరామాయణము


భార్యయుం దాను నిర్భరలీల వసియించి
        యుండె. నా బ్రాహ్మణుం డొక్కనాఁడు
శైలసానుస్థితశాద్వలతలమునఁ
        బొలుచునిష్టత నుండ, భూధరంబు


గీ.

క్రింది సౌభాగ్యసంపద లంద మొంద
సకలసేనాసమన్వితప్రకటలీల
మెఱసి మృగయానురక్తుఁడై మెలఁగుచున్న
మానవేంద్రునిఁ జూచి విస్మయము పొంది.

58


క.

చింతించె విప్రుఁ డీభూ
కాంతునిసౌభాగ్యమహిమ గడు నొప్ప నయో
సంతసమున దిగ్వలయం
బంతయు నే నెప్డు రాజ నై యేలుదునో?

59


వ.

అని చింతావృతమానసుం డై యమ్మహీసురుండు పంచత్వంబు నొంది
పద్మభూపాలుం డై జనియించె. నాబ్రాహ్మణిశరీరంబు విడిచి లీల
యనుపేర నీవ యై యుదయించితివి. మీ రిరువురు మృతు లై యష్ట
మదివసంబు వర్తిల్లుచున్నది. యిచ్చట డెబ్బదియేండ్లు రాజ్యసుఖంబు
లనుభవించితి. రిప్పుడు పద్మభూపాలుండు కాలగోచరుం డగు ప్రథమ
దివసంబున నయ్యీభూపతికి షోడశవర్షంబు లయ్యె నని వాణి
మఱియు నిట్లనియె.

60


క.

ఆవనితయు మును నీగతి
వావిరి ననుఁ బూజసేసి వరయుగళంబున్
దా వేఁడఁ బ్రియునిజీవము
వే విడిచియు నిజగృహంబు వెడలక యుండన్.

61


వ.

ఇట్లు గావున మీ యిరువుర సర్వసంసారమును నా బ్రాహ్మణి మంట
పంబునంద యున్నయది. పునర్జాతుం డగుభూపతిసంసారంబు భవ