పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

45


సీ.

అని వాణి తనయింటి కరుగుటయును, నంత
        లీల సేసెను వినిర్లేపబుద్ధి
బాహ్యకర్మంబులఁ బాసి శీఘ్రంబున
        నిర్వికల్పసమాధినిష్ఠ నిల్చి,
రంజిల్లునంతఃకరణపంజరముఁ బాసి,
        పరమాత్ముఁ బరిపూర్ణు నిరుపమాను
నిరుపాధికుని బొంది నిఖిలంబుఁ గనుదివ్య
        దృష్టి మైఁ దనపతిఁ దేఱి చూడఁ,


గీ.

బరఁగ షోడశవత్సరప్రాయ మైన
భూమిపాలకుఁ డగుట నద్భుతముఁ బొంది,
వాణిఁ దలఁచిన నప్ప్రొద్దె వచ్చి భద్ర
పీఠమున నున్నఁ గని మ్రొక్కి ప్రీతిఁ బలికె.

54


గీ.

వాణి, యద్భుత మయ్యె; నావరున కెట్లు
సృష్టివలనన వేఱొకసృష్టి పుట్టె
నేమి? యీ జాగరభ్రమ నెఱుఁగవలయు
నానతి మ్మన లీల కిట్లనియె దేవి.

55


క.

అతివా మృతిఁ బొందిన నీ
పతితొలుపుట్టువును దలఁప భ్రాంతియ; యిపు డీ
క్షితిపతి రెండవజన్మము
ధృతి నిట్టిద యివ్విధంబు దెలియఁగ వినుమీ.

56


వ.

అది యెట్లంటేని.

57


సీ.

తనరుచిదాకాశమున నొకానొకచోట
        సంసారమంటపస్థలము గలదు
దానియం దొకగిరితటమున నొక్కెడ
        నొకయూర నొక్కవిప్రోత్తముండు