పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

వాసిష్ఠరామాయణము


జెల్లంబో నను జీవితేశుకడకుం జేర్పించి రక్షింపవే.

47


వ.

అని విలపించుచున్న యప్పరమసాధ్వి నూఱించి వాణి యిట్లనియె.

48


క.

రాకాశశిముఖి, విను చి
త్తాకాశం బనఁగ మఱి చిదాకాశము నా
నాకాశం బనఁ ద్రివిధం
బై కర మొప్పారు, నవి నిరాకారము లౌ.

49


వ.

అట్లు గావున నివి యాకాశబ్దవాచ్యంబు లై యుండు, నందు దక్కి
నరెంటినిం బొరయక నెద్ది వెలుగు నది చిదాకాశం బని యెఱుంగు.
మవి పరస్పరవిలక్షణంబు లై యుండు నెట్లనిన బుద్ధియందు వికార
స్ఫూర్తియు,నాకాశంబున జాడ్యపరిపూర్ణతయుం, గలిగి యుండు.
నందును రెంటినిం బొరయక చిదాకాశంబు వికారజాడ్యంబులు దొ
ఱంగి స్ఫురత్స్ఫూర్తులు గలిగి యుండు. మఱియు నాసంవిత్స్వరూ
పంబునకును.

50


క.

దేశముననుండి వేఱొక
దేశంబును బొందునపుడు తిర మై నడు మే
దేశము లే కునికి చిదా
కాశం బని యెఱుఁగు మాత్మఁ గమలదలాక్షీ.

51


క.

అందును సంకల్పాదుల
నెందును నెడబాసి పొంది తేనియుఁ బరమా
నందు సకలాత్ము శాంతుం
బొందెదు సంశయము విడుము పూర్ణేందుముఖీ.

52


గీ.

అఖిలదృశ్యంబు లెడఁబాసి యందుఁ బొందుఁ
గాని యొండువిధమ్మునఁ గానఁబడడు,
మద్వరంబునఁ జేసి నీమగనిఁ గాంచె
దతివ శీఘ్రంబ యవ్విధం బాచరింపు.

53