పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

43


గీ.

వాణి, నాకంటె మున్ను నావరుఁడు తనువు
విడిచెనేనియుఁ దజ్జీవుఁ డెడలిపోక
నొగి నిజాంతర్గృహంబున నుండునట్లు
వరము గృపసేయు మొకటి శాశ్వతము గాఁగ.

41


వ.

మఱియు నేను మత్పతినిమిత్తం బై యెప్పుడు నినుఁ జూడ వేఁడెద
నప్పుడు నాకుం బొడచూపునట్టివరంబునుం గా నీరెండువరంబులు
నొసంగుము-----అని ప్రార్ధించిన నట్ల యగుం గాక యని మఱియు
నద్దేవి యిట్లనియె.

42


ఉ.

నీపతి మేను వాయునెడ నెయ్య మెలర్పఁ బ్రసూనమంటప
స్థాపితుఁ జేసి పుష్పములు దట్టముగాఁ బయి నింప నంగకం
బే పరి పోక పుష్పములు నెండక క్రమ్మఱ నీకు భర్త యై
ప్రా పగు నాత్మగేహమునఁ బాయఁడు జీవుఁడు దా వియత్ప్రభన్.

43


క.

అని చెప్పి వాణి చనుటయు
మనమున హర్షించి లీల మణికొ న్నేండ్లుం
జనఁ దత్కాలంబునఁ దన
పెనిమిటి మృతుఁడైనఁ జూచి బెగ్గిలక ధృతిన్.

44


క.

భారతి చెప్పిన విధమున
నారాజుఁ బ్రసూనమంటపాంతఃస్థునిఁ గా
జేరిచి పైఁ బుష్పంబులు
బోరనఁ గుప్పించి శోకపూరితమతి యై.

45


వ.

సరస్వతిఁ దలంపఁ దత్క్షణంబ చనుదెంచిన నద్దేవిపాదంబులపైఁ గన్నీ
రు దొరంగం బ్రణమిల్లి గద్గదకంఠి యగుచు నిట్లనియె.

46


శా.

తల్లీ భారతి మద్విభుండు మృతుఁ డై తా నేఁగె నీ చెప్పిన
ట్లెల్లం జేసితి; నాతఁ డెం దణఁగెనో? యెచ్చోట నున్నాడొ? నా
యుల్లం బానృపు బాసి యోర్వగలదే? యొం టెట్లు వేగింపుదున్?