పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

వాసిష్ఠరామాయణము


బొరిఁ జిదాకాశకోశకోటరమునందు
భూము లంతఃస్థితంబు లై పొలుపు మిగులు
నని యెఱుంగుము మనమున వనజనయన.

67


వ.

ఎట్లనినం బరమాణురూపం బగుచిదాత్మయందు దద్రూపం బగు
మనంబున జగత్తులు ప్రతిభాసాత్మకంబు లై యుండును. అనిన విని
లీల యిట్లనియె.

68


క.

జననీ, యావిప్రుడు చని
యెనిమిదివసంబు లంటి; విచటను మాకుం
జనియెను సప్తతివర్షము;
లెనయఁగ నె ట్లయ్యె? దీని నెఱిఁగింపు తగన్.

69


సీ.

అన విని దేవి యిట్లనుఁ బ్రతిభాస మౌ
        కంటె నెందును దేశకాల దైర్ఘ్య
ములు లేవు చిద్రూపమున కట్టి ప్రతిభాస
        తీరు సెప్పెద, విను ధీరహృదయ
జీవుండు మరణమూర్ఛావస్థ ల ట్లొంది
        తెలివొంది తొల్లిటితలఁపు లుడిగి
యవ్యభావము నొంది యాధేయమౌనిది
        యాధారమం దున్కి హస్తపాద


గీ.

సహిత మీమను గలయది; జనకునకును
సుతుడు; నా కిట్లు సౌకర్యహితులు వీర
లికి మదీయాస్పదం బనునిట్టిభ్రాంతిఁ
దొడర వేగంబ జగములు దోచుచుండు.

70


వ.

అనిన విని లీల యిట్లనియె.

71


క.

పరమేశ్వరి, నీచేతం
బరమజ్ఞానంబు గానఁ బడసితి, నాభూ