పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

27


క.

ఇవి తత్త్వనిశ్చితార్థము;
విదితం బిది తప్ప లేదు వేఱొక్కటి నీ
మది దృశ్య ముడిగినాఁడవు
పదిలంబుగ, నిదియ పట్టి భ్రాంతిఁ దొఱఁగుమీ.

144


క.

అని తత్త్వనిశ్చయము తన
జనకుఁడు మును చెప్పినట్లు జనకుఁడు సెప్పన్,
విని మానసవిశ్రాంతియుఁ
దనరఁగ, శుకయోగివరుఁడు తత్పతి కనియెన్.

145


క.

నా తెలివియు నిట్టిద మును,
మాతండ్రియుఁ జెప్పుశాస్త్రమత మిదియే, నీ
చేతం దెలియఁగ వింటిని,
జేతోవిశ్రాంతిఁ గంటిఁ జిత్సౌఖ్యనిధీ.

146


క.

అని శుకుఁడు నిశ్చితార్థము
గని బహుకాలంబు నిర్వికల్పసమాధిం
దనరియు నిర్వాణతఁ బొం
దెను దా నిఃస్నేహయుక్తి దీపమ పోలెన్.

147


వ.

అని చెప్పి విశ్వామిత్త్రుండు రామచంద్రున కి ట్లనియె.

148


గీ.

శుకుఁడు తెలిసినట్ల సకలంబు నీవును
దెలిసినాడ; వాత్మ మలినమార్జ
నమ్ము వొంది నీవు నన్ను వేఁడినమాట
కుత్తరంబు నిదియె చిత్తగింపు.

149


వ.

జ్ఞాతృజ్ఞేయం బైనచిత్తం బతిసమగ్రం బగుభోగబృందానుభవంబు లే
కునికియ లక్షణం బగువస్తువు జగం బగు, బంధంబు భోగవాసనచేత
దృఢం బగు, నవ్వాసన శాంతం బైన నబ్బంధంబు తనుత్వంబు నొందు.
అని సెప్పి విశ్వామిత్రుడు వసిష్ఠమహామునిం గనుంగొని, యిమ్మహా