పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

వాసిష్ఠరామాయణము


త్మునకు బుద్ధివిశ్రాంతి యగువాక్యంబు లుపదేశింతురు గా కని పలు
కుటయు, నమ్మహాముని తొల్లి కౌశికునకు దనకు నైన వైరం బుప
శాంతి పొందెడునట్లు కమలగర్భుఁడు చెప్పిన వాక్యంబులు రామచం
ద్రునకుం జెప్పం దలంచి యి ట్లనియె.

150


సీ.

అనఘ, సంసారంబునందు సర్వంబును
        బౌరుషంబునఁ బొందఁ బడెడి; నందు
విను పౌరుషము రెండువిధము లై యుండు, స
        శాస్త్రంబు శాస్త్రానుసారి యనఁగ
నందు నశాస్త్రంటు నర్థసంప్రాప్తి కా
        శాస్త్రీయ మగు పౌరుషంబు దలఁపఁ
బకమార్థమున కగుఁ; బొరిఁ బూర్వవాసనా
        ప్రాప్తమైన యశాస్త్రపౌరుషంబు


గీ.

పర్వినప్పుడు శాస్త్రీయపౌరుషంబు
చేత నది యడ్డ పెట్టుచుఁ జిత్తశాంతి
నిగిడి సతతంబు వర్తింపు నెమ్మితోడఁ
బ్రకటసౌజన్యగుణభద్ర రామభద్ర.

151


గీ.

పూని యనభిజ్ఞచిత్తుఁడ వైననీవు
తగిలి యెందాక సుజ్ఞానతత్త్వుఁ డగుదు
మరగి యందాఁక గురుశాస్త్రమతము లెఱిఁగి
యాచరింపుము నిచ్చలు నతులపుణ్య.

152


వ.

అని చెప్పి, 'సంసారదుఃఖనివారణంబును ధీసమాశ్వాసనంబునుం గాఁ
బరమేష్టి తొల్లి నా కుపదేశించిన వాక్యంబులు తేటపడ నెఱింగించెద
నాకర్ణింపు' మనిన, విని రామచంద్రుండు 'పరమేష్టి యేమి కారణం
బున నేమి యుపదేశించె? నది మీ చేత నెట్లు పొందంబడియె? నత్తెఱం
గానతిం డ' నిన వసిష్ణుం డి ట్లనియె.

153