పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

వాసిష్ఠరామాయణము


కేమిగతి నెన్నఁ డణఁగును?
ధీమన్నుత తెలియ నాన తీవే నాకున్.

137


వ.

అనిన వేదవ్యాసుండు పుత్త్రున కి ట్లనియె.

138


క.

తనబుద్ధివికల్పనమున
జనియించు జగంబు; దాని సంక్షయమున నా
శన మొందును సంసారం;
బని మదిఁ గను మిదియె నిశ్చితార్థము పుత్త్రా.

139


క.

అని యిట్లు తండ్రి సెప్పిన
వినుతోక్తులు వినియు శుకుడు విద్యానిధి ని
మ్మనమున బహూకరింపమి,
గని వేదవ్యాసుఁ డతనిఁ గని యి ట్లనియెన్.

140


క.

ఏ నింతకు మిక్కిలి విన;
భూనుత నీ వడుగువాక్యముల కుత్తరముల్
ధీనిధి మిథిలానాథుడు
భానునిభుఁడు జనకభూమిపాలుఁడు సెప్పున్.

141


వ.

అతఁడు నీచిత్తసంశయంబుఁ బాప సమర్థుం డచ్చటికిం జని యడుగు
మనిన, శుకుండును జనకానుమతంబున మిథిలానగరంబునకున్ జని,
మహామునిగణ రివృతుండైన జనకుం గాంచిన, నమ్మహాత్ముండు
ప్రత్యుత్థానంబు సేసి యమ్మహానుభావుం బూజించి యాగమనప్రయో
జనం బడిగిన, శుకుండు దన తండ్రి నడిగిన యట్ల యడిగిన విని జన
కుండు పెద్దయుంబ్రొద్దు విచారించి యి ట్లనియె.

142


క.

అనఘ, చిత్పురుషుఁ డొక్కఁడె;
విను మన్యము లేదు; తత్త్వవిధ మిట్టి దగున్;
దన సంకల్పమె బంధము
తనసంకల్పక్షయంబ తగ ముక్తి యగున్.

143