పంచమాశ్వాసము
233
క. ఈ సప్తభూమికల న
భ్యాసం బొనరించు నతని కఘభవభయముల్
వే సమయు, నీకుఁ జెప్పితి;
నీసరణి సుఖింపు నీవు నిల రఘురామా.297
వ. అని వసిష్ఠుండు సప్తమభూమికోపాఖ్యానంబు సవిస్తరంబుగా నెఱింగిం
చిన సంతుష్టాంతరంగుం డై రఘుపతి మునిపతి కి ట్లనియె.298
చ. పరమరహస్యరూప మయి పావన మై నిగమాంతసార మై
పరఁగిన బ్రహ్మవిద్య బహుభంగులు మీ రటు చెప్పి చిత్తమున్
మెరమెర మాన్పి నార, లిఁక మీదిపదస్థితిఁ గంటి, మంటి, మ
ద్గురుఁడును దల్లిదండ్రులు సఖుండును దైవము మీర సంయమీ.299
చ. అనిన వసిష్ఠుఁ డి ట్లనియె నచ్యుత మాధవ పుండరీకలో
చనుఁడ వనాదివిష్ణుఁడవు శాశ్వతమూర్తివి కారణార్థ మై
జననము నొంది నాదెసఁ బ్రసన్నదయామృతదృష్టి నించి యీ
పనిగొని యెల్లలోకముల భవ్యునిఁ జేసితి నన్ను రాఘవా.300
వ. అని వినయావనతవదనుండై యనేకవిధంబులం బ్రశంసించి రామచం
ద్రుని వీడ్కొని పసిష్ఠుండు నిజాశ్రమంబునకుం జనియె. నక్కుమార
చూడామణియును సర్వసముండును, శాంతుడును, జీవన్ముక్తుండు, నై
రాజ్యసుఖంబు లనుభవించుచుండె. నీవును నీయర్థంబు నేమఱక
చిత్తంబున నిల్పుకొని సుఖివి గ. మ్మని యుపదేశించిన విని, భరద్వా
జుండు వాల్మీకిమునికిం బ్రణమిల్లి వీడ్కొని పరమజ్ఞానసంపన్నుం
డును, జీవన్ముక్తుండు, నై నిజేచ్ఛ విహరించుచుండె. నని వాసిష్టరా
మాయణంబు పదార్థప్రమేయంబుల సరణిఁ దప్పక తెనుంగుభాష
గద్యపద్యంబుల రచియించితి; నవధరింపుము.301
శా. శాంతస్వాంత నిరస్తదైత్యగణ భాస్వచ్ఛిన్మయాకార దు
ర్దాంతౌఘప్రతికూలనామచయ, వేదవ్యాసవాక్యార్థవి