పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

231

గీ. మొదలిభూమినుండి మూఁడుభూములు వ్యవ
     హారమాత్రభేద మై జగంబు
     పుట్టు దోఁచు చునికిఁ బొల్చు జాగ్రత్సంజ్ఞ,
     నందుఁ బొందుఁ గేవలార్యుఁ డెందు.286
క. కర్తవ్యము లొనరించి, య
     కర్తవ్యము లుడిగి, ప్రకృతికరణభరణతన్
     వర్తిల్లుచు శాస్త్రార్థ మ
     నార్తస్థితి సలుపునతఁడ యాచార్యుఁ డగున్.287
వ. అట్టి యాచార్యత్వంబు ప్రథమభూమి నంకురితంబును, ద్వితీయభూమి
     వికసితంబును,దృతీయభూమి ఫలితంబును, నగు నందు నాచార్యుండై
     మృతుండైనయోగి శుభసంకల్పసంచితంబు లగు దివ్యభోగంబులు
     చిరకాలం బనుభవించి క్రమ్మఱ భూలోకంబునం బుట్టి యోగియగు.
     నీతృతీయభూమికాభ్యాసంబున నజ్ఞానపరిక్షయంబుఁ బొంది చిత్తంబు
     పూర్ణేందుమండలనిభంబై సంవిద్ బోధంబు సంభవించు నంత.288
సీ. ఎనయ నాలవభూమి కెక్కినయోగీంద్రు
                    లవిభాగమున ననాద్యంతపదము
     సమముగాఁ జూతురు, సర్వంబు నిబ్భంగి
                    ద్వైతంబు లేక యద్వైత మొందు,
     స్వప్నంబుగతిఁ దోఁచు జగము గానఁ జతుర్థ
                    భూమి స్వప్నాఖ్యమై పొలుచు; నంత
     శరదంబుదాంశంబు సరి బుద్ధిపలచ నై
                    యణఁగి సత్తామాత్ర మగుచు నిలిచి
గీ. సరి నశేషంబు నొక్కట శాంతిఁ బొంది,
     నపగతద్వైతనిర్భాసుఁ డై సుషుప్తి
     నెనయఁ బంచమభూమిక నెక్కుఁ గాన
     సొరిది నీభూమి కొప్పు సుషుప్తి సంజ్ఞ.289