పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

230

వాసిష్ఠరామాయణము

గీ. మనికిప ట్టగు; నంతర్విమర్శ నొంది,
     ధృతి నసంగత్వమను నీతృతీయభూమిఁ,
     గన్న పురుషుండు, సంకల్పకలన లుడుగు,
     ననిన విని రామచంద్రుఁ డి ట్లనియె మునికి.282
వ. మహాతా! మూఢుండు, నసత్కులసంభవుండుఁ, బ్రమత్తుండు, నప్రాప్త
     యోగసంగుండు, నగువారికి నెట్లు సంసారోత్తరణం బగు? నీభూమి
     కలయందు నొక్కటిని బొంది మృతుం డగువాని కెట్టిగతి సంభవించు?
     నెఱింగింపవే; యనిన నమ్మునిపుంగవుం డి ట్లనియె283
సీ. రూఢదోషుం డగుమూఢున కొకమాటు
                    జన్మశతంబులు చనినఁ, గాక
     తాళీయమున నైనఁ దజ్ జ్ఞసంగతి నైన
                    నలరు వైరాగ్య; మ ట్లంతదాఁక
     సంసార మధికమై సాగు; నావైరాగ్య
                    మొంద వాలాయంబు నుదయ మొందు
     నాదిభూమికయందు నణఁగు సంసారంబు,
                    సరి నొప్పు శాస్త్రార్థసంగమంబు;
గీ. యోగభూమిక నొంది మే నురిలెనేని,
     భూమికాశానుసారతఁ బొదలిపోవు
     నతఁడు సురమానమున దివ్యసతులఁ గూడి
     యమరపదమున భోగంబు లందుచుండు.284
ఉ. అంతట పుణ్యబాపనిచయం బుడివోవఁగ శుద్ధు లైన శ్రీ
     మంతులయింటఁ బుట్టి మును మాయనివాసన భూమికాక్రమా
     క్రాంతి వహించి మీఁద నధికం బగుభూమిక కెక్కి యోగి యై
     యంతము లేనియట్టి పరమాత్మయ తా నగుచుండు రాఘవా.285