పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

229

     డును, బాధకుండును, నేఁ గాన నియును; సుఖదుఃఖంబు లీశ్వరాధీ
     నంబు లనియును; భోగరోగంబులును, సంయోగవియోగంబులు
     ను, గాలవశం బనియును ; ననేకవస్తువులయందు నాసఁజేయక యునికి
     సామాన్యసంగం బగు. మఱియుఁ దత్క్రమవియోగంబున, దుర్జన
     వియోగంబున, నాత్మజ్ఞానప్రయోగంబునఁ, బౌరుషప్రయత్నంబున,
     సంతతాభ్యాసంబునం జేసి, పరమవస్తువు కరతలామలకంబై తోఁచు
     చుండు, సంసారసాగరంబునకుఁ బారంబును సారంబు నగు పరతత్త్వ
     స్థితిఁ జెంది, సకలంబు నీశ్వరాధీనం బనుటయుఁ బూర్వకర్మం బను
     టఁయుఁ దొఱంగి, మౌని యై పరమశాంతిం బొందుటయు నది విశేషా
     సంగము బని మఱియును.279
మ. వెలియున్ లోనును క్రిందు మీఁదు దిశలున్ విన్వీథియున్ జేతనం
     బు లజాండంబులు వస్తు వస్తుకలనంబుం బొందఁగా భాసమై
     కలిమిన్ లేమిని డింది కాంతిమయమై కళ్యాణ మై నిత్యమై
     యలరారున్ రఘునాథ యిట్టిది విశేషాసంగమం బెప్పుడున్.280
ఉ. సమ్మదసౌరభంబును నసంసృతిపత్త్రచయం బచింతనా
     ళమ్ము నవిఘ్నకంటకతలంబును నై వెలయున్ వివేకప
     ద్మ మెదలోపల న్మొలచి తత్త్వవిచారరవిప్రబుద్ధమై
     యిమ్ముల ని య్యసంగులకు నిచ్చు ఫలంబు తృతీయభూమికన్.281
సీ. సజ్జనసంగతి సత్కర్మసంచయం
                    బునఁ గాకతాళీయముగ జనించు
     నాదిభూమిక యనునమృతాంకురము వి
                    వేకాంబుసేచనం బెంచి యరయవలయు,
     నది యుదకంబున సరళమై తలయెత్త
                    ఘనవిచారంబునఁ గర్షకుండు
     సారంభ మరసిన ట్లరయంగవలయు; నీ
                    భూమిక తరువాతిభూమికలకు