220
వాసిష్ఠరామాయణము
గీ. దద్విధ త్యాగ భోగకర్తవ్యములకు
నెట్టి లక్షణ? మనిన నుమేశుఁ డనియె౼
బరమగోప్యంబు క్రైవల్యపదము, నైన
దీని నెఱిఁగింతు, నెంతయుఁ దెలియ వినుము.236
క. జనియును, మృతియును, ధర్మం
బు నధర్మము, దుఃఖమును, లే దని నె
మ్మనమునఁ బోవిడు నెవ్వం
డనఘా, మఱి యతఁడె పో మహాత్యాగి ధరన్.237
క. ఫలవిఫలరాగరోషో
జ్జ్వలధర్మాధర్మదుఃఖసౌఖ్యము లెందున్
దలఁపక చరించు నెవ్వం
డలఘుమతీ, యతఁడె పో మహాకర్త ధరన్.238
క. సమభావన నెందు విరో
ధము వడయుక, కోర్కు లెల్ల దా వీడ్కొని ప్రా
ప్తమ యనుభవించు నెవ్వం
డమలమతీ, యతఁడె పో మహాభోక్త ధరన్.239
వ. మఱియు దృశ్యకరణం బంతయు దొఱంగిన యతండును, మహాత్యాగి
యగు. నని శంభుండు భృంగీశున కుపదేశించె. నీవు నీమార్గం
బెఱింగి సుఖింపుము.240
క. అంతర్ముఖుఁ డై కృత్యం
బంతయు వెలి నాచరించునయ్యోగియ యే
కాంతుఁడు నిరహంకార
స్వాంతుఁడు నై చిన్మయాత్మసౌఖ్యముఁ గాంచున్.241
వ. అని భృంగీశోపాఖ్యానం బెఱింగించి, వసిష్ఠుం డాత్మాహంకారాభిధా
నవిచారంబున నెఱుంగ నశక్యంబైనయది గురూపదేశంబున నెఱుంగ