పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

219

     దేహములు వోవ చెడిపోక దేహియందు
     నేకనిర్లేపరూప మై యెసఁగి వెలుఁగు.231
వ. ఇట్లు గావున శాంతంబును, సర్వంబు, నేకంబును, నాద్యంతవర్జితంబు
     ను, భావాభావనిర్ముక్తంబును, నగు బ్రహ్మంబ కాని యితరంబు లేదని
     యెఱింగి, సుఖివి గ, మ్మని మిథ్యాపురుషోపాఖ్యానంబు సెప్పి, వసి
     ష్ఠుండు సమాధిరహితం బయ్యును, మహాకర్తృత్వంబున ధీవిశ్రాంతి
     సంభవించు. నీ యర్థంబున భృంగీశోపాఖ్యానంబు గల, దాకర్ణింపు
     మని రామచంద్రున కి ట్లనియె.232
గీ. వివిధ మగుచింత లన్నియు విడిచి పెట్టి,
     భవ్యచిన్మాత్రకోటరపదవిఁ గూడి,
     వేద్యనిర్ముక్త మైన సంవిత్తి తత్త్వ
     నిష్ఠ, నేప్రొద్దు విహరింపు, నృపవరేణ్య.233
క. వినుచుం బల్కుచు ముట్టుచుఁ
     గనుచున్ మూర్కొనుచుఁ గ్రొత్తగా దిది సత్యం
     బని తలఁపు మెల్లక్రియలును
     ఘన మగుచిద్బ్రహ్మతనువు గా కొండగునే.234
వ. అది యె ట్లంటేని.235

భృంగీశోపాఖ్యానము

సీ. భృంగీశుఁ డొకనాఁడు గంగాధరునిఁ గాంచి
                    మ్రొక్కి హస్తంబులు మొగిచి౼దేవ,
     యేనిశ్చయముఁ బట్టి యీ జగజ్జీర్ణగే
                    హమున గతజ్వరుఁ డై చరింతు,
     నాన తిమ్మనిన; — మహాదేవుఁ డను ౼సర్వ
                    శంకలు నుడిగి సుస్థైర్యలీల
     ననఘ మహత్యాగి వగుము, మహాకర్త
                    వగుము, మహాభోక్త వగు, మనుటయుఁ