పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

218

వాసిష్ఠరామాయణము

     యివి నాకు దక్కెఁ బొ మ్మనునంత, నాయిల్లు
                    కాలవశంబునం గూలుటయును,
     నాయింటితోడ నా యాకాశమును బోయెఁ
                    గటకటా యనుచు దుఃఖమునఁ బొగిలి,
గీ. చపలమతిఁ బొంది, యీ యాకసంబు గావ,
     నాతఁ డొక నూయి ద్రవ్విన, నదియుఁ గూల,
     గూపగత మైన బయలును గూలె నకట
     యనుచు వాపోయెఁ, దత్పరుఁ డగుటఁ జేసి.227
క. వెండియును గగనరక్షకుఁ
     గుండంబులు మేడ మాడుగులు నూతులు వాఁ
     డొండొండు కట్ట నవి చెడు
     చుండఁ, దదాకాశములకు, నో యని యేడ్చెన్.228
వ. అని చెప్పి వసిష్ఠుం డీవృత్తాంతంబు తేటపడ నెఱింగించెద, నాకర్ణిం
     పు. మమ్మాయాపురుషుండు సర్గాదియందు ననంతంబును, నసత్తును,
     శూన్యంబును నై, స్వయంప్రకాశం బగు నంబరంబున జనియించిన య
     హంకారం బగు. నతండు నాత్ముం డయ్యును నాత్మరక్షణార్థం బై యనే
     కశరీరంబులు గల్పించుకొని యవి చెడుచుండ నాత్మహాని యయ్యె
     నని దుఃఖితు డగుచుండు. నీవును నట్లపోలె ఘటమఠాకాశనాశక్లేశం
     బునం బొందక సుఖం బుండు. మని మఱియు ని ట్లనియె.229
శా. ఆకాశంబునకంటె విశ్రుతము శూన్యం బవ్యయంబున్ సదా
     వ్యాకోచంబును నైనయాత్మ యది గ్రాహ్యం బౌనె నెద్దానఁ; జి
     త్తాకాశంబున మేన పుట్టి చెడఁగా నయ్యాత్మయుం బోయె నం
     చేకాలంబున నేడ్చు భూతతతి దా నిక్ష్వాకువంశాగ్రణీ.230
గీ. ఘటమఠాదులు చెడిపోవ గగన మెందు
     నేక మై యున్న భంగిమై నినకులేశ