పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

221

     నగు. నీయర్థంబున నిక్ష్వాకూపాఖ్యానంబు గల దాకర్ణింపు;
     మన విని, రఘువల్లభుండు — మహాత్మా, యహంకారాభిధానం బగు
     చిత్తంబు గళితం బగునప్పుడు సత్త్వగుణం బెట్లు నిలుచు? నానతిమ్మ
     నిన, నమ్మునిపతి యి ట్లనియె.242

ఇక్ష్వాకూపాఖ్యానము

సీ. కలుషంబు చెడి యహంకారమయస్వాంత
                    మడఁగంగ, లోభమోహాదు లెందుఁ
     బొదలవు; బలిమి మైఁ బుట్టెనేనియు వాని
                    ముంప లే, వుదక మంబుజము వోలె;
     ముదితాదికస్త్రీల వదనంబు విడువుము,
                    వాసనాగ్రంథులు నోసరిల్ల,
     గోపంబు రూపఱు, లోపించు మోహంబు;
                    గాన కవ్యాపన్న మైనవస్తు
గీ. వమలవిజ్ఞానదృష్టి నాద్యంబు గాఁగ,
     ముక్తి కుద్యోగి గానట్టిమూఢహృదయుఁ
     గాల్పనే! రామ, తొల్లి యిక్ష్వాకు మనువు
     నడిగె, నీయర్థ మదియు నేర్పడఁగ వినుము.243
క. ఎట్లు జనించెఁ బ్రపంచం?
     బెట్టిది రూపంబు దీని? కీభవపాశం
     బె ట్టూడును? వలలందును
     బిట్ట వెడలి నట్లు ముక్తి బెరయున్ దండ్రీ.244
వ. అనిన విని యిక్ష్వాకునకు మను వి ట్లనియె.245
శా. ఓహూ యీదశ నీవివేకమున ని ట్లొప్పారె నీప్రశ్న మీ
     దేహాద్యం బగుదృశ్య మింతయు మృగీతృష్ణాంబు లె ట్లట్ల; తా