పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

215

     యని పూర్వశరీరధారిణియు, మనోహారిణియు, నై తనమ్రోల నున్న
     యింతిం గనుంగొని విస్మితోల్లసితలోచనుం డై శిఖిధ్వజుం డి ట్లనియె.212
ఉ. ఓలలితాంగి నవ్యదళనోత్పలలోచన యెందునుండి నీ
     వే లరుదెంచి తిందులకు? నీ చిఱునవ్వులు నీ మృదూక్తులున్
     నీ లలితాస్యమండలము నీ చనుదోయి మదీయభార్య చూ
     డాలయ పోలె దోఁచెడు; విడంబము మాని యెఱుంగఁ జెప్పుమా.213
సీ. అన విని చూడాల నగుదు నే; సంశయం
                    బేల నరోత్తమ! యిట్టి నేన
     కుంభరూపంబుఁ గైకొని నిన్ను బోధింప
                    నన్నిరూపంబులు నైతి వినుము,
     విదితవేద్యుఁడ వీవు విజ్ఞానదృష్టి నం
                    తయుఁ జూచుకొ మ్మన్న, ధరణినాథుఁ
     డచ్చరు వంది రాజ్యము వాసినది మొద
                    లిడి తుద యగుకృత్య మెల్ల నాత్మ
గీ. గృష్టిఁ గనుఁగొని, నిజసమాధియును వదలి,
     యుచితభాషల నద్దేవి నూఱడించి,
     సంతసము మానసంబున వింతసేయ
     నతివ కవికారలీల ని ట్లనియె, విభుఁడు.214
వ. నిరీహుండును, నిస్పృహుండును, నిరాళుండును, శాంతుండును,
     సహమర్థరూపంబు నై యున్నవాఁడ. నింతియగాని యన్యంబు లే
     దని కేవలచిన్మాత్రనిష్ఠుండఁ గావున మోదఖేదంబులం దొఱంగి నిబ్బ
     రంబున నతిశయక్షయరహితత నొంది సంవిద్రూపంబు నైతి నది
     యిట్టి దట్టి దని చెప్ప నశక్యంబు.215
క. నీకారణమున భవము ని
     రాకరణ మొనర్చి, సంవిదాకాశగతిన్