214
వాసిష్ఠరామాయణము
రమ్ము నాకమునకు, రంభాదిసతులు నీ
యొప్పు చూడఁగఁ గోరుచున్నవార;
లఖిలభోగంబుల నచట జీవన్ముక్తుఁ
డవు నీవు కల్పాంత మనుభవింపు౼
మనుడు మహీపాలుఁ డచటిపోడుము లెల్ల
నెఱుఁగుదు, నాకేల యింత సెప్ప?
గీ. నెచట నేనియు దీవియ నా కచట నేల?
నెల్లచోటుల నే రమియింతు సుఖము;
స్వర్గ మది యెంత యచ్చటి సౌఖ్య మెంత?
యందు రా నొల్ల విచ్చేయు మమరనాథ.208
క. అన విని సురవిభుఁ డతనిన్
గనుఁగొని దీవించి చనిన గ్రమ్మఱఁ; దా నా
తని రాగద్వేషస్థితిఁ
గనిఁ గా కని తలం చెఁ గపటప్రేమన్.209
చ. మెలఁతు యోగమాయ నొకమిండనిఁ దా ఘటియించి వేడ్కమైఁ
జెలఁగుచుఁ బర్ణశాలకడఁ జీఁకటిమామిడిమ్రానిక్రింద ను
ద్గళరవకంకణక్వణనతాడనభూషణచుంబనధ్వనుల్
కలగొని మ్రోయఁ జౌర్యరతిఁ గాంతుని వీనులు సోఁకఁ జేయఁగాన్.210
క. అంతయు గని యాపతి యా
వంతయుఁ జింతిలక ముదిత లగుదురు గాతన్
గాంతయు విటుఁడును నని తా
సంతసమున నచటు వాసి చనియె నిజేచ్ఛన్..211
వ. ఇట్లు చనుటయుం గని చూడాల యచ్చెరువడి యహో యనేక
సిద్ధులు నితని యందుండు నీతని చిత్తంబు గలంపనేర, నత్యంతసుస్థి
రుం డయ్యెంగదే! యని యతనికి నిజవృత్తాంతం బెఱింగించెదగాక;