పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

213

గీ. అధిప నిన్నుఁ జూడ నరుదేర, నడుమ దు
     ర్వాసుఁ డట్టె చూచి వట్టియలుకఁ
     గనలి రేలు సతివి గ మ్మని శపియించె,
     నదియ దుఃఖహేతు వనిన నృపుఁడు.202
క. అడలకు మునివర నియతిం
     గడవగ రా దది యవశ్యకర్తవ్యకుమ నా,
     పడు గౌఁ గా కని రేలం
     బడతియుఁ బగ లెల్లఁ బురుషభావము నగుచున్.203
ఉ. కొన్ని దినంబు లి ట్లగుడుఁ గోమలి నా కగుభర్త ధాత్రిలో
     నెన్నఁగ లేఁడు భూప, నను నీవ వరింపు మటన్న , దీన నే
     మున్నది? యట్ల కా కనుడు, నుగ్మలియుం గపటానురక్తితో
     నన్నరనాథుఁ గూడి సుఖ మందుచు నుండెఁ జెలంగి రాత్రులన్.204
క. ఈగతిఁ గొన్నాళ్లకుఁ బతి
     భోగేచ్ఛఁ బరీక్ష గొనఁగఁ బొలఁతుక మాయా
     యోగమున నొకసురేంద్రుని
     వేగమ పుట్టింప నతఁడు విబుధులు గొలువన్.205
మ. చనుదెంచెన్ సితదంతి నెక్కి విపులైశ్వర్యంబుతో దేవతా
     వనితావక్త్రసరోజసౌరభసుఖవ్యాసంగభృంగాంగనా
     ఘనఝంకారసమేతకిన్నరవధూగానానుమోదాత్ముఁ డై
     జననాథాగ్రణిపాలికిం జనఁగఁ, బూజల్ చేసె నాయింద్రునిన్.206
వ. ఇవ్విధంబునఁ బూజించి;౼దేవా! యతిదూరం బగుదివంబున నుండి
     యిచ్చటికి రాఁగతం బేమి? యనిన; నతనికి దివిజనాయకుం డి ట్లనియె.207
సీ. భూమీశ నీగుణంబులు విని వచ్చితి
                    మరయ భిక్షులు వచ్చుకరణి; నిపుడు