216
వాసిష్ఠరామాయణము
గైకొంటి, నీకు మ్రొక్కెద
నా కాచార్యుండ వీవ నలినదళాక్షీ.216
వ. అనిన విని చూడాల యమ్మహీపాలుని బోధించి నిజపురంబునకుం దో
డ్కొని పోయి యిరువురు జీవన్ముక్తులై పదివేలేండ్లు రాజ్యసుఖంబు
లనుభవించి విదేహముక్తులై; రని చూడాలోపాఖ్యానం బెఱింగించి;
వసిష్ఠుండు ౼ చిత్తత్యాగంబున సర్వత్యాగంబగు. నీయర్థంబునఁ గచో
పాఖ్యానంబు గల దాకర్ణింపు, మని రామచంద్రున కి ట్లనియె.217
కచోపాఖ్యానము
చ. కచుఁడు మరుద్గురున్ జనకుఁ గన్గొని మ్రొక్కుచు, నయ్య, సంసృతి
ప్రచరణ మె ట్లణంగు? నని పల్కిన;౼ సర్వవివర్జనంబు దా
నుచితము దీని కన్నఁ;౼ జని యొక్కఁడు గానల వత్సరాష్టకం
బచలితవృత్తి నుండి, శమ మందమి వెండియుఁ జెప్పెఁ దండ్రికిన్.218
క. చెప్పిన సర్వత్యాగము
యప్పుడు బోధించి తండ్రి యరిగినఁ, గచుఁడున్
దప్పక గతకల్మషుఁ డై
యప్పాటఁ జరింప, మూఁడుహాయనములకున్.219
క. మతి శమ మందక వాచ
స్పతి గ్రమ్మఱఁ గాంచి యలఁతఁ బడి యిట్లను;౼ నీ
గతి సర్వంబును విడిచిన
నతిశయవిశ్రాంతి యేల యందదు తండ్రీ.220
వ. అనిన కొడుకున కతఁ డి ట్లనియె, చిత్తత్యాగంబు చేసిన సర్వశాంతి
యగు ననినఁ, ౼ జిత్తం బెట్టిది? తత్త్యాగం బేవిధంబున సంభవించు?
జెప్పవే, యనిన గురుం డి ట్లనియె.221
క. చిత్తమున నొకటి వేఱే
హత్తిన యంతరభిమాన మది గావున నో