పంచమాశ్వాసము
205
సీ. అనఘ వింధ్యము ధర, యాగజం బీవు, వై
రాగ్యవివేకముల్ రదనయుగము,
హస్తిపుం డనఁగ నీయజ్ఞత, రాగశృం
ఖలమునఁ గట్టినకాలు మనసు,
ఆగొలు సూడ్చుట భోగేచ్ఛ విడుచుట,
తాటిపై నుండి తా ధరణిఁ బడుట
పరగ రాజ్యము నీవు పాసిరాఁ దలఁకున
జ్ఞానంబు, దయ వానిఁ జంపకుంట
గీ. ఫలసమాసక్తితోఁ జేయఁబడినక్రియలు
దాన క్రమ్మఱ లేచి యజ్ఞాన మట్లు
వారకయ వచ్చి నీవెంట పడిఁ బ్రపంచ
ఖాతమునఁ ద్రోచె నినుఁ బట్టి భూతలేంద్ర.163
క. నీ వారాజ్యము విడిచిన
దా విడువక వెంటఁ దగిలి తఱి దప్పక ని
న్నావిధినిఁ ద్రోచె లోఁబడఁ
దా వడి నినుఁ గట్టి మోహతమ మచలాత్మా.164
క. ఆ మదకరిపరివారము
నీమానసవైభవంబు, నెఱి నోదముపై
వేమఱు గప్పిన తీఁగెలు
భూమీశ్వర వినుము నీ తపోదుఃఖంబుల్.165
వ. అని గజోపాఖ్యానంబు కుంభుండు శిఖిధ్వజునకుఁ జెప్పె. నని వసిష్ఠుం
డు రామచంద్రున కెఱిఁగించె. నిబిడంబైన గురూపదిష్టజ్ఞానంబున
సర్వత్యాగంబు గలుగు. అట్లు శిఖిధ్వజుండు కుంభుండు చెప్పిన వాక్యం
బులు విని సంతుష్టాంతరంగుం డై యతనితో ని ట్లనియె.166
మ. పుడమిన్ రాజ్యము మందిరంబులు మహాభోగంబులున్ మాని యీ
యడవిన్ దాపసి నైతి, విప్ర, సకలత్యాగంబు లిం కెట్లు? నా;