పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204

వాసిష్ఠరామాయణము

గజోపాఖ్యానము

.

సీ. కలదు వింధ్యాటవి గజరాజ మొక్కటి
                    తత వజ్రసన్నిభ దంతశోభి,
     హస్తిపుఁ డొక్కఁ డాహస్తి నేర్పునఁ బట్టి
                    గొలుసున నొకతాటఁ గుదియఁ గట్టి,
     మ్రా నెక్కె; నంత నాయేనుఁగు కొమ్ముల
                    సంకెలఁ ద్రెంచుచో సరభసమున
     నామ్రాని విఱుచునో యని వాఁడు దానిపై
                    కుఱికెద నని తప్పి యుర్విఁ బడిన,
గీ. వానిఁ గనుఁగొని కరుణ నవ్వారణేంద్ర
     మిట్లు పడియున్న వాని నిం కేల చంప
     ననుచు మన్నించి తనభూమి కరిగె, నడవి
     జంతువులయందుఁ బుణ్యవాసనలు గలవు.159
ఉ. ఆతఁడు వెంబడించికొని యాకరి చొప్పున నేఁగియేఁగి తా
     నాతతగుల్మమధ్యమున నారసి గల్గొని దానిఁబట్ట నా
     ఖాతము ద్రవ్వి నాకలము గప్పినఁ, గానక కుంభి దామద
     స్యూతత నందుఁ గూలెఁ గులిశోద్ధతిఁ గూలినకొండకైవడిన్.160
గీ. ఇవ్విధంబున లోఁబడి యిభముఱేఁడు
     కట్టువడియును పోని దుఃఖమున నుండె;
     నట్లెగా ధర లోఁబడ్డయపుడె పగఱఁ
     దునుమఁ డేనియు మీఁదట దుఃఖ మొందు.161
క. అని చెప్పి కుంభుండు నీకు గజదృష్టాంతకథాభిప్రాయం బెఱుంగం
     బోల దెఱింగించెద. దీనం బ్రబుద్ధుండవై సర్వత్యాగపరుండవు గమ్మని
     యి ట్లనియె.162