202
వాసిష్ఠరామాయణము
వనవాసంబునఁ గ్రుస్సి తాపసుఁడ నై వర్తించుచున్నాఁడ; నిం
దును నేమందు సుధారసంబు విషమై దుఃఖంబు రెట్టించెడున్.149
ఉ. నా నతఁ డిట్లనెన్ ధరణినాథ సులబ్ధి గురూపదేశవి
జ్ఞానమ, నిత్యకర్మములు నా మదిఁ గాలముఁ బుచ్చుకంటె; న
జ్ఞానులు వాసనారతి ఘనం బగుతత్క్రియలన్ ఫలేచ్ఛమై
నూని యొనర్తు, రీవు నటు లుండుట యజ్ఞత గాదె చూడఁగన్.150
క. ఏ నెవ్వఁడ! నె ట్లీ సు
జ్ఞానం బగు? నెట్లు చిత్తశమ మగు? నని య
జ్ఞానత నేల నలందుర
భూనుత! యన, నతఁడు విప్రపుత్త్రునితోడన్.151
క. గురుఁడును దండ్రియుఁ బంధుఁడు
బరమాప్తుఁడ వీవ, శిష్యభావన నన్నుం
గరుణింప నీకు మ్రొక్కెద
ధరణీసురవర్య; యనుడుఁ దత్పతి కనియెన్.152
తరల. గురుఁడు చెప్పినభంగిఁ బుత్త్రుఁడు కోరి చేసినచాడ్పునన్
ధరణినాయక చెప్పెదన్ విను తథ్య మైన మదుక్తులన్
అరయ నద్భుత మైనయీయితిహాస మిట్లు ప్రసక్త మై
యరుగుదెంచెను దీనిఁ జెప్పెద నాత్మబోధము సెప్పెడున్.153
చింతామణ్యుపాఖ్యానము
వ. అది యె ట్లంటేని.154
సీ. సర్వగుణాఢ్యుండు శాస్త్రియు నయ్యును
తజ్ జ్ఞుండు నగునొక్క ధన్యపురుషుఁ
డవనివారి కసాధ్య మై చింతామణిఁ
బడయంగఁ గోరి తపంబు సేయ,