200
వాసిష్ఠరామాయణము
కిరాటోపాఖ్యానము
సీ. అనిన వసిష్ణుండు విను రామ వింధ్యాద్రిఁ
గలఁడు కిరాటుఁ డొక్కరుఁడు భార్య
యును దాను నార్తుఁ డై మునివోలెఁ దిరుగుచు
నొక్కజాంగలభూమి నొక్కగవ్వ
కసవుమాటున నున్నఁ గనుఁగొని కృపణుఁ డై
గదియంగఁ జని యది గానలేక
యచ్చోటఁ గసవుగాం డ్రంతయుఁ బుచ్చి య
త్నంబున దివసత్రయంబు వెదక
గీ. నంత పూర్ణేందుమండలం బనఁగ వెలుగు
నమరమణి యబ్బె నతనికి; నట్లు గవ్వ
వెదక మణి యబ్బినట్లు కోవిదగురూప
దేశగతి నాత్మబోధంబుఁ దెలియఁ బొందు.138
వ. ఒకటి వెదుక నొకటి కానంబడుఁ. గావున గురూపదేశంబు తత్త్వజ్ఞానం
బునకుఁ గారణం బగు నని కిరాటోపాఖ్యానంబు సెప్పి, వసిష్ఠుండు సం
శయగ్రస్తచిత్తునియందు విజ్ఞానంబు నిలువనేర: దీయర్థఁబున చింతా
మణ్యుపాఖ్యానంబు గల దాకర్ణింపు మని రామచంద్రున కి ట్లనియె.139
ఉ. అంత శిఖిధ్వజుండు మది నాత్మవివేక మెఱుంగలేక య
త్యంతతమోనిమగ్నుఁ డగునట్లు విమోహితుఁ డౌచు దుఖిత
స్వాంతముతోడ భోగములు సత్యము గా వని చాలరోసి దే
శాంతర మేఁగి తీర్థముల నాడుచు గృచ్ఛ్రము లాచరించుచున్.140
గీ. ఎందునను జిత్తవిశ్రాంతి నొంద లేక
యార్తుఁడై రాజ్య మిది విష మని తలంచి
ప్రజల బాలింపఁ జూడాలఁ బనిచి యడవి
నుగ్రతప మాచరించుచు నుండె నంత.141