పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198

వాసిష్ఠరామాయణము

     గారుఁ గృశోదరంబు నల కావలియుం బొలుపొందఁగా దర
     స్మేరకటాక్షము ల్వొలయఁ జెచ్చెర వచ్చె నిజేశుపాలికిన్.137
క. వచ్చినభామినిఁ గనుఁగొని
     యచ్చెరువడి యానృపాలుఁ డంబుజనయనా,
     యిచ్చెలువ మైనయౌవన
     మెచ్చట నీ కబ్బె? ననిన నింతియుఁ బలికెన్.138
సీ. విను మేను విడుచుట వెండి పుట్టుట లేదు;
                    జననాథ, యిది సహజంబు దలఁప;
     నీసర్వమును బాసి యాసర్వమును సత్య
                    మును నైనయొక్కటి ముట్టఁగంటి;
     నాకాశసంకాశ మై కేవలం బైన
                    మనములో నశ్రాంతమును రమింతు,
     లే దుదయంబును, లేదు నాశనమును,
                    లేనిదియును లేదు, లేదు కలది,
గీ. అననుభూతియ యనుభూత మని సుఖింతు;
     దోషమును రోషమును మది దోఁప దెపుడు;
     జగ దఖండప్రభుత్వంబు సంభవించె,
     నాత్మ కిది రూప మి దరూప మనఁగ లేదు.129
క. గతరాగద్వేషంబుల
     నతిసూక్ష్మపు శాస్త్రదృష్టి యనుచెలికత్తెల్,
     సతతము గొలువఁగ, మది శ్రీ
     మతి నై సుఖ మున్నదాన మనుజవరేణ్యా.130
చ. మును నయనంబులుం గరణముల్ మతియుం గనువాని నెమ్మెయిన్
     గనుఁగొన, వీనితోడ వెలిగానివియుం బొడగాన; నాత్మ నెం
     దును నిది యిట్టిభావ మని తోఁపదు; సుస్థిర నైతి దీన౼నే