పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

197

గీ. అదియు బాలుని భూతంబు గుదుచుభంగి
     భ్రమిత మగుచున్న జీవంబుఁ బట్టు జడతఁ,
     గావున నదియు నేగాఁను, జీవ మనినఁ
     బ్రాణమయమై కలంకువఁబడుమనంబు.123
వ. ఇట్టి సుకుమార మగుజీవం బన వేఱె యొకటి యుండంబోలు. నోహో
     యెఱింగితిం గదే! ఆది జగదుదయైకకలంకమును, స్వస్వరూపంబు నగు
     చిద్రూపంబుచేతన బ్రతుకుచున్నయది.124
క. అక్కట సంవిద్రూపం
     బిక్కపటజ్ఞేయకలన నెనసినజడతం
     జిక్కినది యిట్టు, లనలము
     పెక్కుదకముఁ బొంది రూపుఁ బెడఁబాయుగతిన్.125
సీ. అట్టి చిన్మయముఁ జైత్యము గూడి జడము శూ
                    న్యమును జైతన్యబోధ్యంబు నయ్యె,
     నింతకాలమునకు నెఱిఁగితి నిబ్భంగి
                    సకలంబు చిద్విలాసంబు దలఁప,
     నమలత సమత నహంకారరహిత మై
                    యుండు చిత్సత్తయ యెండు లేదు,
     శూన్యమై యుండెడు శుద్ధసత్తయె బ్రహ్మ
                    మచ్యుతంబు శివంబు నై వెలుంగు,
గీ. నను వివేకంబు నెమ్మది నభ్యసింప,
     నాత్మబోధ మఖండ మై యాత్మఁ బొడమ,
     నవ్వధూమణి పొల్చెఁ బెం పగ్గలించి
     లాలితం బైన నవపుష్పలతయుఁ బోలె.126
ఉ. ఆరమణీలలామ నవయౌవనసంపద నివ్వటిల్ల శృం
     గారరసంపుబొమ్మ యనఁగా నలిచన్నులుఁ జిన్నిమోము నూ