196
వాసిష్ఠరామాయణము
వించె, నంతఁ గొంతకాలంబునకు నిజపురవిభుఁడు మృతుండైనం, బౌరు
లు రాజర్షి యైన భగీరథుకడకుం జనుదెంచి ప్రార్థించినఁ గ్రమ్మఱం
జని రాజ్యాభిషిక్తుం డై సప్తసముద్రముద్రితం బగుధరావలయంబు
పాలించుచు సర్వసముండును, శమయుక్తుండును, వీతమత్సరుండును,
బ్రాపకార్యకర్తయు, గృతనిశ్చయుండును, జీవన్ముక్తుండు నై యుండె,
నని భగీరథోపాఖ్యానం బెఱింగించి వసిష్ఠుండు ప్రతిబంధంబులు వా
యక యాత్మజ్ఞానంబు దుర్లభం బగు నీయర్థంబున శిఖిధ్వజోపా
ఖ్యానం బెఱింగించెద నాకర్ణింపు. మని రామచంద్రున కి ట్లనియె.120
శిఖిధ్వజోపాఖ్యానము
సీ. అనఘ చూడాలాఖ్యయును శిఖిధ్వజుఁడును
నను దంపతులు రాజ్య మనుభవించి,
వార్ధకంబున ముక్తవాంఛమై యధ్యాత్మ
శాస్త్రముల్ విన గురుశరణ మొంది,
రందు చూడాల ము న్నాత్మప్రబోధకై
నిర్మలబుద్ధిఁ జింతించె నిట్లు;౼
ఆత్మ యెయ్యది? కాయయష్టిచోదితలోష్ట
మట్లు హృత్ప్రేరిత మైనతనువు
గీ. నింద్రియగణంబు నేఁ గాను. హృదయ మనిన
దరములిడి రాయివొరలించుకరణి బుద్ధి
నిశ్చయంబునఁ బొడవడి నిగుడుఁగాన,
నదియు నేఁ గాను నే నందు నేని.121
క. అని నిశ్చయాత్మ గావున
నది జడ మేఁ గాను నిశ్చయము నిస్సారో
ద్యదహంకృతిజన్మం బగు
నదియును నేఁ గాను మఱి యహంకృతి యన్నన్.122