పంచమాశ్వాసము
195
క. భీషణసంసారరుజా
భేషజమును రాగశైలభిదురము దళిత
ద్వేషము నైన యహంకృతి
శోషణ నాత్మోపలబ్ధి చొప్పడు ననుడున్.114
క. గిరియందుఁ దరువు పొదలిన
వరుసన కాయంబునందుఁ బ్రభవించె నహం
కరణ; మది యెట్లు చెడు? నని
ధరణీశ్వరుఁ డడుగ, గురుఁ డతని కి ట్లనియెన్.115
మ. సకలంబుం బెడఁబాసి శాంతత విశేషంబుల్ విసర్జించి పా
యక నిర్భీకత యీషణత్రయమనోహంకారశత్రుండ వై,
యకలంకాత్ముఁడ వై, యకించనత భిక్షాహారి వై, యెందుఁ జే
రక వర్తించిన నున్నతోన్నతపదప్రాప్తుఁడ వౌ దెల్లెడన్.116
క. అని త్రితలుఁడు బోధించిన
జననాథుఁడు సన్న్యసించి జగమున భిక్షా
శనుఁ డై ధీవిశ్రాంతిం
గనుఁగొని క్రుమ్మఱుచుఁ గొంతకాలంబునకున్.117
గీ. మార్గవశమునఁ జేసి క్రమ్మఱఁగఁ దనదు
పురికి నేతేర నెఱిఁగి యప్పురమువారు
పిలిచి యిండ్లకుఁ గొనిపోయి భిక్షసేయ
నచట భూపతి చనుదెంచి యర్థి మ్రొక్కి.118
క. ఈరాజ్య మేలుకొమ్మని
యారాజు ప్రియంబు సెప్ప నచ్చట నుండన్,
దా రోసి వెడలి క్రమ్మఱి
ధారుణిఁ గ్రుమ్మఱుచుఁ గనియెఁ దనగురు నొకచోన్.119
వ. కనుఁగొని వినయావనతుం డై తనకు చిత్తవిశ్రాంతి యగుట విన్న