194
వాసిష్ఠరామాయణము
నిజప్రశ్నోత్తరంబులు విని సంతుష్టాంతరంగుఁ డై బేతాళుం డతని
విడిచి భావితాత్ముండును, నవిచారవంతుండును, విగతక్షుత్పిపాసుండు
ను, నై యొక్కయేకాంతప్రదేశంబున నిరంతరధ్యానపరుండై సుఖం
బుండె. నని బేతాళోపాఖ్యానంబు సెప్పి వసిష్ఠుం డింక దుర్లభంబగు
బుద్ధివిశ్రమం బాత్మప్రయత్నంబున సులభం బగు. నీయర్థంబున
భగీరథోపాఖ్యానంబు గల దాకర్ణింపు మని యి ట్లనియె.
110
భగీరథోపాఖ్యానము
సీ. రాజేంద్రుఁ డగుభగీరథుఁడు ప్రాణులయార్తి
నరసి నిర్విణ్ణుఁ డై యాత్మఁ దలఁచి,
తిరిగివచ్చుచు నుండు దినములు రాత్రులు,
నాదానదానంబు లణఁగ వెందు,
నిస్సారకృత్యంబు నిత్య మై జరిగెడు,
నెద్ది ప్రాపింపంగ నెల్లక్రియలు
జెడిపోవు నా చేతఁ జిక్కిన దం దెల్ల
నత్యంతదుర్వ్యాప్తి; యని విరక్త
గీ. చిత్తుఁ డై త్రితలుని గురు, జేరి మ్రొక్కి,
యయ్య యీదుఃఖముల కెప్పు డవధి యనుడుఁ;
దనదు చిన్మాత్ర యగు పరమాత్మ యెప్పు
డెఱుగఁబడు నప్పు డీయార్తి దొఱఁగు, ననిన.111
క. విని నరపతి చిన్మాత్రము
ననుపమమును నచ్యుతంబు నని యెఱుగుదు, నా
త్మను, నందు నాకుఁ జిత్తం
బనఘా యెబ్భంగి నిల్చు నని యడుగుటయున్.112
వ. అనిన విని త్రితలుం డి ట్లనియె.113