పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

191

సీ. అవిభాగయును, ననాయాసయు, నాద్యంత
                    శూన్యయు, నైనసుషుప్తి సత్త.
     ధ్యానచిత్తులకు నధ్యానమానసులకు
                    మౌనసంగతిమై సమంబు దలఁప,
     నానాత్వవిభ్రమం బైనయీజగ మెల్ల
                    నస్థిరం బని నిర్ణయముగ నెఱిఁగి,
     సందేశరహితచిత్సద్భావ మది యౌర
                    కౢప్తమైనట్టి సుషుప్తి యండ్రు,
గీ. ఏకమయ్యు దా ననేకసంవిద్రూప
     మై వెలుంగు జిత్స్వభావ మదియ
     యనిన యట్టియెఱుక యత్యంత మగునేని,
     మహిత మగుసుషుప్తి మౌన మండ్రు.98
క. విను సమ్యగ్ జ్ఞానస్థితి
     నొనరించి సమాధిఁ జేసి యుత్తమసంవి
     ద్ఘను లగువారల నెందును
     ననుపమవిజ్ఞానయోగు లండ్రు, కుమారా.99
క. సమమతిఁ బ్రాణమనోయో
     గము నందఁగ శాశ్వతమును ఘనతరము ననా
     ద్యము నగు చిత్పద మొందెడు
     నమృతాత్ములె యోగయోగ్యు లండ్రు మునీంద్రుల్.100
వ. ఇ ట్లిరుదెఱంగులవారికి నకృత్రిమం బగుసంవిత్తత్త్వం బెట్టిదనిన. వాస
     నావాగురాక్రాంతం బగుమనఃప్రాణవర్తనంబు లెచ్చోట నణంగు
     నదియ పరమపదం బనంబడు. సంసారస్వప్నవిభ్రాంతులయందు బేతా
     ళవాక్యంబులైన శుభప్రశ్నంబులు గల వవి యెఱింగించెద నాకర్ణిం
     పు; మని వసిష్టుం డి ట్లనియె.101