పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

వాసిష్ఠరామాయణము

బేతాళోపాఖ్యానము

మ. వెలయు గర్కటిభంగి నాత్మవిదుఁ డౌ బేతాళుఁ డొక్కండు రే
     యిల వర్తించుచు నొక్కపట్టణములో నేకాకి యై వచ్చు భూ
     తలనాథుం గని వెంటఁబట్టి ౼ నరనాథా మాకు నాహార మీ
     స్థలి నీవాత్మవిదుండ వేనిఁ జెపుమా సాధించి మాప్రశ్నముల్.102
సీ. పరఁగ నేరవిరశ్మిఁబరమాణువులు నజాం
                    డంబు లౌ, నేమారుతంబు వీవ
     నెగయుచు నమ్మహాగగనరేణువు లుండుఁ,
                    బలుమాఱుఁ గలలను గలఁకుఁ జనుచు
     నమలతేజోమయం బగునాత్మరూపంబు
                    విడుచుచు నుండియు విడువఁ డెవ్వఁ,
     డరఁటి యేకం బయ్యు నాకులుఁ బొరలు నై
                    నట్టిచందమున నేయణువు లమరు,
గీ. నణువిధం బగు నేపరమాణువునకు
     నణువు లగు మేరుగగనాబ్జజాండసమితి
     యవయవము లేని యేపరమాణుశిఖరి
     శిలలలోపలిమజ్జ యీసృష్టి యయ్యె?103
క. ఇత్తెఱం గగు నాప్రశ్నల
     కుత్తరములు వేగ చెప్ప నోపవ యేనిన్,
     దుత్తునుకలుగా నాచే
     కత్తిని మెడఁ గోసి నీదుకండలఁ దిందున్.104
క. అని జంకించుచుఁ బ్రశ్నలు
     దను నడిగిన, భూవిభుండు దంతమరీచుల్
     వినువీథి నిగుడ, నాతని
     గనుఁగొని యి ట్లనియె మృదులగంభీరోక్తిన్.105