పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

వాసిష్ఠరామాయణము

వ. ఇట్లు మహాభిక్షుసంకల్పంబు లగుజీవితాదులు శుద్ధసంవిదంశంబులై
     నిత్యులుంబోలె నుండి. రిది మనోమాయ యని శతరుద్రోపాఖ్యానం
     బెఱింగించి వసిష్ఠుడు రామచంద్రుని గనుంగొని. ౼యింక సుషుప్తి
     యనువునఁ బునర్జనకం బగు వివేకం బెఱింగించుటకుఁ గర్కటికథ
     యునుంబోలె నొప్పు బేతాళప్రశ్నసంఘంబు గల దాకర్ణింపు. మని
     మఱియు ని ట్లనియె.90
క. మునివృత్తి౼గాష్ఠతాపసి
     యన జీవన్ముక్తుఁ డనఁగఁ న ట్లిరుదెఱఁగై
     చను; నందుఁ గ్రియ లసారము
     లని విడుచు జితేంద్రియత్వ మది ప్రథమ మగున్.91
క. యుక్తాయుక్తము లెఱిఁగి వి
     రక్తుం డయి సంవివేకరతుఁ డయ్యును లో
     కోక్తిఁ జరించిన జీవ
     న్ముక్తుం డగు నది ద్వితీయమునివృత్తి యగున్.92
వ. అట్లు గావున.93
గీ. శాంతు లగువీర లిరువురు సములు, వీరి
     చిత్తనిశ్చయరూపాత్మసత్త యైన
     భావ మది మౌన మని చెప్పఁబడుఁ గుమార
     యదియు మూఁడువిధంబు లై యమరు నందు.94
వ. అది యె ట్లనిన95
గీ. మాటలాడ యునికి వాఙ్మౌన, మింద్రి
     యములఁ గుదియించుబలిమియె యక్షమౌన,
     మన్నిచేష్టలు నడఁగించియున్న యునికి
     కాష్ఠమౌనంబు నాఁబడుఁ, గమలనయన.96
వ. ఇట్లు చెప్పంబడు చిత్తవిభ్రమహరణం బగు మౌనత్రయంబునకు
     గాష్ఠతాపసుండు ముఖ్యుం డట్లు కావున.97