పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

187

     విని వసిష్ణుండు హర్షనిర్భరమానసుండును, పులకితశరీరుండును, బాష్ప
     కణకలితకపోలుండును, గద్గదకంఠుండును, ముకుళితకరకమలుండును,
     నై రామచంద్రుం గనుంగొని౼అహో మహాప్రాజ్ఞుండవు గదే! ఈ
     రహస్యంబు సెప్పి. తీవ యప్పరమేశ్వరుండ. వని యగ్గించి యింక వివేకి
     యగువానికి యుద్ధాదిక్రియలను జిత్తవిశ్రాంతిబోధకం బగునీయ
     ర్థంబున కర్జునోపాఖ్యానంబు గల దాకర్ణింపు. మని యి ట్లనియె.78

అర్జునోపాఖ్యానము

గీ. సమతఁ గర్తృత్వ భోక్తృత్వ సాక్షి యగుచు
     ననుగమించిన పుర్యష్టకాఖ్య మగుచు
     నెఱయు సంవిత్తి యర్జునునిం బ్రబుద్ధుఁ
     డైనకృష్ణుఁడు బోధించె నయ్య వినుము.79
మ. ఇటమీఁదన్ రవిసూనుఁ డైనయముఁ డి ట్లేప్రొద్దు నీప్రాణులం
     బటురోషంబునఁ జంప వేసరి తపఃప్రాప్తుండుగా, భూమియు
     త్కటభారం బుడుపం జనించెదరు వీఁకన్ గృష్ణపార్థాఖ్యు లై
     నటనోదారబలప్రసిద్ధి నరుఁడున్ నారాయణుండున్ భువిన్.80
గీ. అందు భారతరణమున నర్జునుండు
     యుద్ధవిముఖాత్ముఁ డగుటకు నొయ్య నతని
     ననునయించుచు శ్రీకృష్ణుఁ డానతిచ్చు
     నట్టి వ్యాఖ్యాన మెఱిఁగింతు ననఘ వినుము.81
సీ. చిద్రూప మెన్నఁడుఁ జెడదు సంపూర్ణంబు
                    నిర్దోష మీవును నిర్జరుండ,
     వజుఁడవు, నిత్యుండ, వాత్మ, కేపట్టునఁ
                    బుట్టువుఁ జావును బొరయ వెందు,
     నిట్లయ్యె నిటమీద నెట్లగు ననరాదు,
                    శాశ్వతుఁ డాద్యుండు, సర్వమయుఁడు,