పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188

వాసిష్ఠరామాయణము

     తనుబాధ లెందు నాతని సోఁక, వటుగాన
                    ననురక్తి దొఱఁగి యేకాంతబుద్ధి
గీ. నన్ని కర్తవ్యములును బ్రహ్మార్పణముగ
     నాచరింపుము, బ్రహ్మంబ వగుడు వీవ;
     విలయవాయువు వీచిన వింధ్య మగులు
     నపుడు గురుశాస్త్రమతు లలంఘ్యములు పార్థ.82
వ. అట్లు గావున నప్రబోధంబున వాసస లధికంబగు, నాత్మవిజ్ఞానంబువలనం
     జేసి నశించు నని మఱియుఁ బెక్కువిధంబులఁ గృష్ణుం డర్జును బో
     ధించి సమరకర్తవ్యోన్ముఖు జేయంగలవాఁ డగుం గావున నట్ల నా
     సక్తచిత్తుండవై సర్వంబు నాచరింపు మని వసిష్ఠుం డర్టునోపాఖ్యానం
     బెఱింగించి రామచంద్రుం గనుంగొని జంతువులకు జన్మపరంపర సంక
     ల్పభ్రాంతియ. ఈయర్థంబున శతరుద్రోపాఖ్యానంబు గల దాకర్ణిం
     పు మని మఱియు ని ట్లనియె.83

శతరుద్రోపాఖ్యానము

మ. ఒక భిక్షుండు సమాధిశాలి గలఁ డయ్యోగింద్రుచిత్తాంబుజం
     బొకనాఁ డాపగ వీచు లై నిగుడున ట్లుల్లోల మై తా నొకా
     నొకకర్మాశ్రయచింత నొంది తిర మై యొక్కింతసే పుండఁగా
     నొకయాత్మప్రతిభావిశేషకలనం బుద్భూత మై యంతటన్.84
సీ. అతని చిత్తంబు లీలార్థ మై సామాన్య
                    జనభావకాంక్షతో మనుజుఁ డగుచుఁ,
     గోరి జీవితుఁ డనుపే రిడికొని ఘన
                    స్వప్నపట్టణమున సంచరించి,
     యట పానమదమత్తుఁ డై నిద్రవోవుచు,
                    కలలోన విప్రుఁ డై చెలఁగి, యందు
     నిద్రించి కలలోన నెఱయ సామంతుఁ డై