పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

వాసిష్ఠరామాయణము

క. మునిసార్వభౌమ, బిల్వం
     బని యిప్పుడు మీరు సెప్పినది నామదికిన్,
     మును చెప్పిన చిత్సత్తయ
     యని తోచెడి దీనిఁ దెలియ నానతి యీవే.73
వ. అనిన నమ్ముని యఖిలంబును జిత్తోద్భవరూపంబు. అది యహంకారం
     బున విస్తరిల్లుచుండు. ఖేదంబు చిత్తచాంచల్యంబె కాని, యన్యంబు
     గా; దని బిల్వోపాఖ్యానం బెఱింగించి వసిష్ఠుం డధ్యాత్మనిర్వికల్పము,
     నఖండైకరసము, నగు నీయర్థంబు విశదంబు సేయుటకు శిలోపాఖ్యా
     నంబు సెప్పంబడు. నాకర్ణింపు మని రామచంద్రున కి ట్లనియె.74

శిలోపాఖ్యానము

క. మృదువును మెఱుఁగును విస్మయ
     పదమును నిబిడము నరేంద్రపరిపూర్ణము నై
     విదిత మగు నొక్కశిల యన
     నది విని రఘురాముఁ డనియె నధికప్రజ్ఞన్.75
గీ. అనఘ మీరు చెప్పినది చిత్పదమ, యది
     శిలయు ఘనము నేకకళయు నగుటఁ,
     దా నరంధ్ర మయ్యు లోనుంచు జగముల
     మిన్ను గాడ్పు నాఁచికొన్నయట్ల.76
క. నాకము భువియును భవనము
     నాకాశముఁ బర్వతములు నబ్ధులు దిశలున్
     దూఁకొని శిలలో నివి గన
     నేకత మచ్ఛిద్రతయును నెందుఁ దలంపన్.77
వ. సకలలోకంబులు దనయంద యుండ యమ్మహాశిలయు నరంధ్రంబును,
     నభేద్యంబును, శంఖచక్రగదాపద్మరేఖాంకితంబును, నై సుషుప్తిభా
     వంబున నుండు పరబ్రహ్మం బని శిలోపాఖ్యానతాత్పర్యంబు సెప్పిన