పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

185

బిల్వోపాఖ్యానము

గీ. ప్రాప్తములు వచ్చుచోటను బ్రథమవేళ
     సుఖిత మగునట్లు, తర్వాత సుఖము లేక
     యునికి యనుభూతసిద్ధంబు జనుల కెల్ల
     దీని నెవ్వఁ డెఱుంగఁడు ధీరహృదయ.68
ఉ. కోరినవేళ వస్తు వొడఁగూడ సుఖం, బది మీఁదఁ గల్గ; దా
     గౌరవ మెల్లఁ గోరికయ గావున, వాసనఁ బాయ నిస్పృహా
     చారత సర్వకర్మములుఁ జల్పుము, పెక్కుకళంకువల్ మదిం
     గూరిననైన; దీని మదిఁ గొందల మందక నిల్పు రాఘవా.69
వ. సర్వాత్మకంబు నేకంబు నగు బ్రహ్మంబు భువనభ్రమవిభ్రమంబుల ననే
     కంబువోలె నుండు. నంతియగాని తక్కొండు లే దీయర్థంబు బిల్వఫ
     లరూపంబునం జెప్పంబడు వినుము.70
సీ. విపులత్వమునను వేవేలయోజనము లై
                    యుగసహస్రములందు నిగిరిపోక
     నమలంబు నధికంబు నతివిస్ఫుటంబు నై
                    యొక్కమారేడుబం డొప్పుచుండు,
     నది ప్రాఁతయయ్యును నమృతాంశుశకలమా
                    ర్దవసుందరంబు నై తనరుచుండుఁ,
     గల్పాంతవాతవేగంబునఁ గదలక
                    కోటియోజనముల కొలఁది వడిని
గీ. మూల మనఁగల్గి యీజగంబులకు నెల్లఁ
     దాన యాధార మగుచుండు, దాని చుట్టు
     మెఱసి బ్రహ్మాండములు విశ్రమించుచుండు,
     రవికులక్షీరనిధిచంద్ర రామచంద్ర.71
వ. అనిన విని రామచంద్రుఁ డి ట్లనియె.72