పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

వాసిష్ఠరామాయణము

గీ. ఇదియు దుఃఖౌఘనిరసని, యిందు నిలిచి
     యెవ్వ రుండుదు; రట్టివా రెల్లనాఁడు,
     శుద్ధబుద్ధస్వరూపులు సుఖులు ఛిన్న
     మతులు నై యెందుఁ దగులక మనుదు రనఘ.31
క. విను బహిరంతర్ముఖముల
     మునివర ప్రాణము నపానమును వర్తిల రెం
     టిని గూర్చి నడుమఁ జిత్తముఁ
     గొనకొని వర్తింప నదియ కుంభక మయ్యెన్.32
క. మానుగఁ బ్రాణము వొదువ క
     పానం బడఁగంగ నేది ప్రబలుం డమల
     జ్ఞానస్వరూపతత్త్వము
     నానందముతో భజింతు ననవరతంబున్.33
ఉ. ప్రాణ మణంగి యుండఁగ, నపానము నుద్భవ మొందకుండఁ, ద
     త్ప్రాణవియత్పదంబున నకంపితమై కలనాకలంక ని
     ర్వాణము నిష్కళంకముఁ బరంబుఁ జిరానుభవోత్తమంబు గీ
     ర్వాణనుతంబు యోగిసుకరంబును నైనపదంబు నొందెదన్.34
గీ. అట్టి ప్రాణసమాధిని నట్టివిమల
     సంవిదానంద మైనవిశ్రాంతి గలిగి,
     తలఁప భూతభవిష్యదర్థముల నెపుడు;
     వర్తమానంబు చూతు నకర్త నగుచు.35
క. ఆపదలను ధీరుఁడ నై
     శ్రీపరిణతి సముఁడ నగుచుఁ జిత్తంబున న
     వ్యాపితభావాభావుఁడ
     నై పెంపునను జిరజీవి నై యున్నాఁడన్.36
వ. అనిన నతనిం గనుంగొని 'మహాభాగా, నీచరిత్రం బింతయొప్పునే! యతి