పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

177

     బ్రాణు లపమృత్యురహితు లై చిరంజీవు లెట్లగుదు రెఱింగింపవే.
     యనిన నవ్వాయసవిభుం డి ట్లనియె.26
క. దోసము లనుమౌక్తికములు
     వాసన లనుతంతువుల నవారణఁ గ్రువ్వన్,
     రోసినచిత్తమువానికి
     నోసరిలున్ మృత్యు వెందు నుత్తమపురుషా.27
క. విను నిర్మలమును బావన
     మును నేకముఁ బరమసౌఖ్యమును నైనపదం
     బున నెవ్వనిమది దగులునొ,
     యనఘా, యాతనికి మృత్యు వతిదూర మగున్.28
గీ. ప్రకటసంసారరోగకారణము లగుచు
     నడరు కామాదిశత్రుల నడఁచునట్టి
     యాత్మరతులును బ్రాణచింతాభియుతులు
     నగుమహాత్ముల దెస మృత్యు వరుగ దెపుడు.29
వ. ఈ రెంటియందును సర్వదుఃఖక్షయకారిణియు, సకలభాగ్యదాయిని
     యుఁ, జిరాయుఃకారణంబును, నగు ప్రాణచింతన మతిసుఖప్రద యై
     వర్తిల్లు, దాని విధం బెఱింగించెద నాకర్ణింపుము.30
సీ. పరఁగ హృద్గత మైన ప్రాణానిలము వెలి
                    ద్వాదశాంగుళమాత్ర వచ్చి యణఁగు
     నది రేచకం బగు; నదియ నిశ్చలత
                    బహిఃకుంభకం బగు; నదియ మఱలి
     హృదయంబు సొచ్చి పెం పెసగఁ బూరక మగుఁ;
                    గదల కాంతరకుంభకత్వ మొందుఁ;
     దప్పక యిబ్భంగిఁ దాన వర్తిలువాయు
                    చింతనం బది ప్రాణచింత యండ్రు,