పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

వాసిష్ఠరామాయణము

     నతండు తత్సాధనంబు లైన ద్రవ్యంబుల నయ్యైసిద్ధులం బొందు. ద్రవ్య
     మంత్రక్రియాకాలశక్తులు సిద్ధిప్రదం బగు, నైనను బరమపదప్రా
     ప్తికి నంతరాయంబులు గాని యుపాయంబులు గావు. అట్లు గావున.269
గీ. సమత నిచ్ఛాసమూహంబు శాంతిఁ జేసి
     యాత్మలాభంబు నొందినయట్టి యోగి
     కకట తుచ్ఛపుసిద్ధులయందు నేల
     తిరుగఁబడుచుండు, చిత్తంబు తెలివి విడిచి?270
క. అనిన విని రాముఁ డిట్లను
     మునివల్లభ పెద్దకాలములు యోగీంద్రుల్‌,
     తనువులు నిల్పి చరింపుదు
     రనిశము నత్తెఱఁగుఁ దెలియ నానతి యీవే.271
వ. అనినఁ బరమసంయమి యి ట్లనియె.272
క. విను మనిలస్పందనమునఁ
     దనువును జలనంబు నొందుఁ, దద్గతి శాంతం
     బును బొందఁ జలనరహితతఁ,
     దనువును సుస్థిరత నొందుఁ, దపనకులేశా.273
వ. అట్లు గాన వాయుధారణానియతు లైనపరమయోగీంద్రులు నిత్యు
     లగుదురు. ఎట్టిదేహంబున మనఃపవనంబులు బాహ్యాభ్య్ధంతరచల
     నంబు లుడిగి యుండు నద్దేహంబు ధాతుక్షీణత లేక చిరకాలం
     బుండు. ననిన విని రామచంద్రుం డి ట్లనియె.274
క. అనఘ వివేకాభ్యుదయం
     బునఁ జిత్తము లయముఁ బొందుపుణ్యాత్ములకున్
     ఘనమైత్ర్యాదిగుణావళి
     యెనయఁగ నె ట్లుద్భవించు నెఱిగింపు తగన్.275
సీ. అనిన నమ్మునిపతి యనుఁ జిత్తనాశం బ