వాసిష్ఠరామాయణము
152
లుపన్యసించు నవాఙ్మానసగోచరం బైనపరతత్త్వంబు తానై వెలింగె.
నది యెట్టి దనిన.260
సీ. శూన్యవాదులు కడు శూన్యతత్త్వం బన,
బ్రహ్మవేత్తలు పరబ్రహ్మ మనఁగ,
విజ్ఞానవంతులు విజ్ఞాన మది యనఁ,
బొరి సాంఖ్య్థయోగులు పురుషఁ డనఁగ,
నెసఁగుయోగీశవరు లితఁ డీశ్వరుం డన,
శివమతాచార్యులు శివుఁ డనంగఁ,
కాలతత్త్వజ్ఞులు కాలరూపం బన,
నాత్మార్థవిదులు చిదాత్మ యనఁగ,
గీ. దాదృశాత్ములు తాదాత్మ్యతత్త్వ మనఁగ,
మాధ్యమికు లెల్ల నిది యాదిమధ్య మనఁగ,
రమణ సమచిత్తు లెల్ల సర్వంబ నాఁగ,
నఖిలసిద్ధాంతసమ్మత మగుచు మఱియు.261
వ. సర్వహృదయానురాగంబును, సర్వతత్త్వంబును, సర్వంబును, నై
నిర్వాతదీపంబునుంబోలె మానసంబు లేక, వెలుంగుల కెల్ల మొదలి
వెలుంగై, యాత్మానుభవైకమానంబు, నేకత్వంబును, ననేకత్వంబు
ను, సాంజనంబును, నిరంజనంబును, సమంబును, నజంబును, నాద్యం
బును, సకళంబును నిష్కళంబును, నగునిరాలంబసంవిత్స్వరూపం
బు దాన యై వెలింగె. నంత.262
క. అప్పరమసంయమీంద్రుఁడు
ముప్పదివేలేండ్లు యోగమును గని చని తా
నొప్పాఱు చిత్తలయమునఁ
దప్పక తద్బ్రహ్మపదము తా నై వెలిఁగెన్.263
వ. అని వసిష్ఠమునీంద్రుండు.264