పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

161

     సంచరింతు ననుచు సంశయింప
     కిచ్చ వచ్చునెడకు నేఁగి వర్తింపు నా
     తల్లి తృష్ణ నీకు దండ మవ్వ.256
వ. అని యి ట్లంతఃకరణగుణంబులను వీడ్కొలిపి ప్రశాంతుం డై యల్ల
     నల్లన ప్రణవోచ్చారణంబు సేయుచు సంకల్పవికల్పంబులు త్రైలో
     క్యసంభవంబులు సూక్ష్మస్థూలతరంబులు నగుబాహ్యాభ్యంతరభావం
     బులం బరిత్యజించి యమ్మునివరుండు.257
సీ. అంతటఁ బ్రాణాంత మగుదీర్ఘనిశ్వాస
                    తంతువుతోఁ గూడి తగుహృషీక
     తన్మాత్రముల నెల్లఁ దరలిచి, యట మీఁదఁ
                    దామసపటలంబు నామ మణఁచి,
     తగిలి ప్రాజ్ఞుని కావ లగుచు నందంబున
                    నొదవు తేజము దాఁటి యదియుఁ ద్రుంచి,
     తమము తేజము లేక తగుశూన్యమై తోఁప,
                    నందును దగులక యల్ప మైన
గీ. మనము చేతన మన మనుతృణముఁ దునిమి,
     యప్పు డటఁ బుట్టుశిశువు బోధాంకురంబు
     మాడ్కి నిర్మల మైనచిన్మయపదంబు
     గని నిమేషచతుర్థభాగమునఁ బొందె.258
మ. అనిలుం డచ్చలనంబుఁ బాయుగతిఁ జైత్యం బెల్ల వర్జించి, చ
     య్యన సత్తైకవినిశ్చితంబు నగుపశ్యంతీపదం బొంది, య
     ల్లన మేరుస్థిత మై సుషుప్తిపద మాలంబించి, సుస్థైర్యుఁ డై
     మునినాథాగ్రణి యంత తుర్యపదముం బొందెన్, సదానందుఁ డై.259
వ. ఇవ్విధంబున నిరానందుండును, సానందుండును, స్వచ్ఛుండును, నచిన్మ
     యుండును, చిన్మయుండును, నై నేతి నేతి వాక్యంబుల నుపనిషత్తు