పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

153

చ. మనుజుఁడు పేర్చి దుఃఖసుఖమధ్యమునం బడి తీవ్రవేదనం
     బనుపడి తా జరామరణభంగము లొందును, జీర్ణపర్ణముల్‌
     ఘనగిరిసానుపాతవికలంబున జర్జరితంబు లైన య;
     ట్లనుపమపుణ్య యి ట్లరుగ నారయ నెమ్మదిఁ గానఁ డెవ్వఁడున్.209
వ. అని యనేకప్రకారంబుల బోధించినయగ్రజువాక్యంబులు విని, భా
     సుండు పరమజ్ఞానసంపన్నుందును జీవన్ముక్తుండు నై సుఖం బుండె.
     నని భాసవిలాసోపాఖ్యానం బెఱింగించి వసిష్ఠుండు రామచంద్రుం
     గనుంగొని౼యింక సంగవర్జనంబునను వాయునిరోధంబునను
     సమాధ్యభ్యాసపాటవంబునను జిత్తవిశ్ర్రాంతి సిద్ధించు. నీయర్థంబున
     వీతహవ్యోపాఖ్యానంబు సెప్పంబడు; నాకర్ణింపు మని యి ట్లనియె.210
గీ. ఎందు నభిలాష సేయని డెందమునను
     గోరి సంసారమున నున్నఁ గొఱఁత లేదు.
     ఉగ్రతప మాచరించుచు నున్న నైన
     సక్తచిత్తంబె బంధసంశ్రయము దలఁప.211
వ. అని మఱియు నా నృపశ్రేష్ఠునకు వసిష్ఠుం డి ట్లనియె౼212
గీ. దేహ మిది, దేహి నే నను తెలివి దొఱఁగి,
     తనువు నే ననునట్టి తాత్పర్య మొదవు
     నట్టి సంగంబు బంధార్థ మనఁగ నొప్పు,
     రఘుకులాంబుధిచంద్ర శ్రీరామచంద్ర.213
క. శారీరజ సుఖదుఃఖము
     లారూఢి ననంతతత్త్వ మగునాత్మునియం
     దారోపించిన సంగమ
     మారయ బంధంబుకొఱకు నగు రఘురామా.214
చ. అకుటిల మైనయట్టి పరమాత్మమహత్త్వము సర్వదిక్కులం
     బ్రకటితదేహసాఖ్యములఁ బాయక పొందును; నేను గా ని దే