152
వాసిష్ఠరామాయణము
భాసవిలాసులు తమలోఁ
జేసిన సంవాద మెఱుఁగఁ జెప్పెద వినుమీ.203
వ. ఎ ట్లనిన, వా రన్నదమ్ము లిద్దఱు గల రందు భాసునకు విలాసుం
డొక్కనాఁ డేకాంతంబున ని ట్లనియె.204
గీ. ఎఱుఁగవలసినయర్థంబు నెఱిఁగి కంటె?
పరమబోధంబు గానంగఁ బడియె నయ్య?
బుద్ధి నే పీడయును లేక పొలుచుచున్నె?
యన్న, కుశలంబె నీకు నిరంతరంబు?205
క. అన విని భాసుం డి ట్లను;
నిను నాభాగ్యమునఁ గంటి నిర్మలహృదయా,
ఘనసంసారస్థుల మై
యెనసిన మా కెందుఁ గుశల మెక్కడి దన్నా.206
వ. అనిన విలాసుం డి ట్లనియె.207
సీ. ఎఱుఁగంగ నగునర్థ మెందాఁకఁ దోఁపింప
దందాఁకఁ జిత్తంబు డిందుపడదు.
సంసార మెందాఁక సన్న మై యణఁగదు
చిత్తసంభవములై చెలఁగుచున్న
యాశాలతలు మొద లంటంగ నన్నియు
గొడవంటఁ గోసిన ట్లణఁగి పోవు
ఎందాఁక సమతయుఁ జెందదు పరమాత్మ
బోధ యావంతయుఁ బొడమ దెందు.
గీ. నెట్లు కుశలంబు గలుగ దిం కెన్ని గతులఁ
బ్రకటసంసార మనువిషూచికకు మందు
పరమ మగుచున్న యాత్మలాభంబు దక్క
నేమియును సౌఖ్య మీ నోప దేమి యందు?208