పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

151

                    శ్ర్రాంతాత్ముఁ డగునేని శమము లేదు
     ఆశాతృణావలంబగుతత్త్వబోధంబు
                    పరమసమాధి నాఁబడు మహాత్మ
గీ. నిత్యతృప్తి సమాహితనిశ్చయార్థ
     దర్శనియు నైనప్రజ్ఞయ దగుసమాధి
     దశ యహంకార లోభనిర్ద్వంద్వ యగుచు
     శీతగరిభాతి నగుమతిస్థితి సమాధి.199
వ. అని యివ్విధంబున నంతశ్శీతలయు జీవన్ముక్తియు నను శబ్దంబులకుఁ
     గలయర్థంబు లుపన్యుసించి సురఘుండు నిత్యముక్తుం డై పెద్దకా
     లంబు రాజ్యంబు చేసి విదేహముక్తుం డయ్యె నని చెప్పి వసిష్ఠుండు.200
క. సురఘూపాఖ్యానము విను
     పురుషులు దురితముల నణఁచి పుణ్యాత్మకు లై
     పరమజ్ఞానముఁ బొందుదు
     రరుదుగ నిది చిత్తగింపు మర్కకులేశా.201
వ. అని సురఘూపాఖ్యానం బెఱింగించి వసిష్ఠుండు రామచంద్రున కి ట్లని
     యె విశ్రాంతిరాహిత్యంపుఁబ్రయాసంబులు బహుప్రకారంబు లని
     చెప్పంబడు. నీయర్థంబునకు భాసవిలాససంవాదంబు గల దె ట్లనిన --
     చేతనానుసంధాతయు నంతర్ముఖుండును నఛ్యాత్మమయుండు నై నిరం
     తరంబు నెవ్వండు దుఃఖంబులం బొరయక సుఖించుచుండుఁ, గర్ణ
     ధారునివలనం గలం బెట్లు దరివొందు నట్లా మహానుభావసంపన్నుని
     చేత సంసారార్ణవం బుత్తరించునుపాయంబు గానంబడుఁ గాని, దు
     స్తరంబగునిది; యొండుపాయంబునం గా. దది గావున.202

భాసవిలాసోపాఖ్యానము

క. ఈ సంసారసముద్రము
     భాసురముగ దాఁటు తెఱఁగు ప్రవ్యక్త మగున్,