పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

145

     త్వంబు దాల్చి యతని చిత్తంబు చైత్యంబు పరిత్యజించి చిత్తత్వంబు
     విడిచి శుద్ధచిన్మాత్రప్రభావంబు నొందె. మఱియును.165
గీ. అతఁడు బోధానురక్తుఁ డై యఖిలమునను
     వాసనావర్జితమును విశ్వంభరమును
     వితతమును నిశ్చలంబు నై వెలుఁగుచున్న
     యా చిదాకాశరూపి దా నయ్యె ననఘ.166
వ. ఇవ్విధంబున దృశ్యదర్శనవర్జితంబు నుత్తమాహ్లాదంబును నై
     యమృతార్ణనంబునుంబోలె నొప్పు పరమానందంబునం బొందె
     మఱియును.167
క. ఆమేనివలన వెలువడి
     యేమియు ననరాని యొక్కయిరవున సత్తా
     సామాన్యాత్మత నానం
     దామృతసాగరము దాన యై వెలుఁగొందెన్.168
గీ. పరఁగ నిర్వాతదీపంబుభంగి నిలిచి
     చిత్రరూపంబు కైవడి చేష్ట లెడలి
     సద్ద్విజోత్తముఁ డానందసరసియందు
     నొప్పు చిన్మయహంస యై యుండె ననఘ.169
సీ. అంతటఁ జిరకాల మచ్చోటనుండి, తా
                    నాకాశచరు లగునమరసిద్ధ
     వరుల చిత్రం బైన వరసిద్ధకాలంబు
                    గని, యింద్రదూతలు తనదుయోగ
     విఘ్నకారులు నన విని యన్నిటిని బాసి,
                    పరఁగ జీవన్ముక్తపదవి నొంది,
     యిచ్ఛావిహారుఁడై యిరవైనవనముల
                    దాపసాశ్రయములఁ దత్త్వనిష్ఠ