పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

139

                    తనలోన ని ట్లని తలఁపఁ జొచ్చెఁ;
     బూని యంతటికి ప్రధాన మై ప్రాప్య మై
                    యెద్ది వెలుంగు? నే నెచట నుండి
     యీదుఃఖ మణగింతు? నెప్పు డీతలఁపుఁన
                    బాసి పరబ్రహ్మపదము నొంది
గీ. మేరుశృంగంబుపైఁ బొల్చు మేఘమట్లు
     చిత్తవిశ్రాంతి నెన్నండు చెందఁగలుగు?
     ననుచు సంకల్పములఁ ద్రుంచి హరి గుఱించి
     నిశ్చలధ్యానతత్పరనియతి నొందె.134
క. ఈ తెఱఁగు తపము చేయఁగ
     నాతనిచిత్తంబు నిలువ కగచరగతితో
     వే తిరుగఁ జొచ్చె, నాత్మ
     ప్రీతి నెసఁగునిష్ఠ గడచి బిసబిసపోవన్.135
గీ. ఇట్లు దిరిగెడు చిత్తంబు నెట్టకేనిఁ
     బట్టి బంధించుటయును, లోపలన తిరిగి
     జడిసి యాంతరవిషయనుచయముఁ గూడి
     వెడలి దివి కేఁగె; నురియాడుపులుగువోలె.136
వ. ఇవ్విధంబున బిరుసుదనంబునం బఱచిపఱచి.137
చ. అరుదుగ నొక్కవేళ నుదయార్కనిభద్యుతిఁ గానిపించు; జె
     చ్చెర నొకచో వియత్తలము చెన్నగు; నొక్కకనాఁడు శూన్యమౌ
     నిరవుగఁ దోఁచు నొక్కమఱి; యీగతి నిల్వక చిత్త మేఁపఁగాఁ
     బరమసమాధి నే తెలిసి బాడబుఁ డచ్చటు వాసి వ్రేల్మిడిన్.138
వ. అమ్మహాగిరివిపినంబులఁ బరిభ్రమించుచు నొక్కనాఁ డొక్కయేకాం
     తప్రదేశంబున నుపవిష్టుం డై నిర్వికల్పసమాధి నుండి తనమనంబున
     నిట్లని వితర్కించె.139